బిగ్‌బాస్‌ 2పై కత్తి కార్తీక ఆగ్రహం

kathi karthika fires on bigg boss 2

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

తెలుగు బుల్లి తెరపై బిగ్‌బాస్‌ మరోసారి సంచలనం సృష్టించేందుకు సిద్దం అయ్యాడు. మొదటి సీజన్‌తో భారీ టీఆర్పీని దక్కించుకున్న బిగ్‌బాస్‌ రెండవ సీజన్‌లో కూడా తప్పకుండా విజయాన్ని సొంతం చేసుకుంటుందనే నమ్మకం వ్యక్తం అవుతుంది. భారీ అంచనాల నడుమ నాని హోస్ట్‌గా ప్రారంభం అయిన బిగ్‌బాస్‌ సీజన్‌ 2 పై అప్పుడే ప్రశంసలు మరియు విమర్శలు వస్తున్నాయి. బిగ్‌బాస్‌లో సరైన సెలబ్రెటీలు లేరు అని, బిగ్‌బాస్‌ హోస్ట్‌ కూడా అంతగా ఆకట్టుకోవడం లేదు అంటూ విమర్శలు వస్తున్న నేపథ్యంలో తాజాగా కత్తి కార్తీక కొత్త వాదనకు తెర తీసి మరింతగా చర్చకు తెర లేపింది. గత సీజన్‌లో తెలంగాణకు చెందిన వారు ముగ్గురు ఉండగా, ఈసారి ఒక్క తెలంగాణ వ్యక్తి కూడా లేరు అంటూ కార్తీక ఆగ్రహం వ్యక్తం చేసింది.

సీజన్‌ 1తో పోల్చితే సీజన్‌ 2లో బ్యాలన్స్‌ తగ్గిందని, ప్రేక్షకులను ఎంటర్‌టైన్‌ చేసేందుకు మసాలాను యాడ్‌ చేస్తున్నారేమో కాని, సమతుల్యత అనేది మాత్రం షోలో కనిపించడం లేదు అంటూ కత్తి కార్తీక చెప్పుకొచ్చింది. తెలంగాణ భాష హౌస్‌లో వినిపించడం లేదనే భావన నాకు బాధను కలిగిస్తుందని ఈ సందర్బంగా ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. బిగ్‌బాస్‌ నిర్వాహకులు ఈసారి వ్యవహరించిన తీరు విమర్శనాత్మకంగా ఉందని ఆమె చెప్పుకొచ్చింది. ఇలాంటి పరిణామం షోపై పడుతుందనే అభిప్రాయంను ఆమె వ్యక్తం చేసింది. మొత్తానికి బిగ్‌బాస్‌లో తెలంగాణ వారు లేరు అంటూ కార్తీక లేవనెత్తిన పాయింట్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. ఈ విషయమై ఇంకా ఎంతగా చర్చ జరుగుతుందో, రచ్చ జరుగుతుందో అంటూ స్టార్‌ మా వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.