అధికారులతో కేసీఆర్ సమీక్ష

అధికారులతో కేసీఆర్ సమీక్ష

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రెండు రోజుల పాటు కీలక సమీక్షలు నిర్వహించనున్నారు. ప్రగతి భవన్‌లో ఇవాళ రేపు అధికారులతో పలు భేటీల్లో పాల్గొనున్నారు. ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతిభవన్‌లో కరోనా వల్ల రాష్ట్రానికి జరిగిన ఆర్థిక నష్టంపై అధికారులతో కేసీఆర్ సమీక్ష నిర్వహించనున్నారు. ఆదాయానికి అనుగుణంగా ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలు, సవరించుకోవాల్సిన అంశాలపై చర్చించే అవకాశం ఉంది. కరోనా నియంత్రణకు చేపట్టిన చర్యలు, సవరించాల్సిన అంశాలపై అధికారులతో చర్చిస్తారు.

దీంతో పాటు 2020-21 బడ్జెట్ సమావేశాలపై సీఎం మధ్యంతర సమీక్ష కూడా కేసీఆర్ నిర్వహించనున్నారు. సాయంత్రం 4 గంటలకు యాదాద్రి ఆలయ పనులపై సమీక్షించనున్నారు. ఈ సందర్భంగా యాదాద్రి దేవాలయ నిర్మాణ పనుల్లో పురోగతిపై అధికారులతో చర్చిస్తారు. ఈ సమీక్షలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు, ఆర్థిక శాఖ అధికారులు ఈ సమీక్షలో పాల్గొంటారు. శనివారం నాడు జరిగే సమీక్షలో వచ్చే అంచనాలపై ఆదివారం మంత్రులు, అన్ని శాఖల కార్యదర్శులతో సీఎం సమావేశమయ్యే అవకాశం ఉంది.