ఆమెను నేనేం తరిమెయ్యలేదు

Keerthi Suresh responds on fighting with Trisha for Saamy 2 movie

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
తమిళంలో స్టార్‌ హీరోయిన్స్‌ త్రిష మరియు కీర్తి సురేష్‌ల మద్య కోల్డ్‌ వార్‌ జరుగుతుందనే ప్రచారం జోరుగా సాగుతుంది. వీరిద్దరి మద్య సినిమాల ఆఫర్స్‌ విషయంలో విబేధాలు నెలకొన్నాయంటూ వార్తలు వస్తున్నాయి. త్రిషకు దక్కాల్సిన పలు ఆఫర్లు కీర్తి సురేష్‌ దక్కించుకుందని, ఆ కోపంతో త్రిష కూడా పలు సార్లు కీర్తి సురేష్‌పై విమర్శలు చేయడం జరిగింది. అయితే ఇప్పటి వరకు వీరిద్దరి మద్య వేబేధాలు సీరియస్‌ అవ్వలేదు. ఇద్దరి మద్య పోటీ వాతావరణం నెలకొందని అంతా భావించారు. కాని తాజాగా ‘సామి 2’ చిత్రంలో ఒక హీరోయిన్‌గా నటిస్తున్న త్రిష మద్యలో సినిమాను వదిలేయడంతో మరో హీరోయిన్‌గా నటిస్తున్న కీర్తి సురేష్‌ కారణం అనే వార్తలు జోరుగా వస్తున్నాయి.

‘సామి 2’ చిత్రంలో కీర్తి సురేష్‌ డామినేషన్‌ ఎక్కువ అయ్యిందని, ఆమె మెయిన్‌ హీరోయిన్‌గా చూపించే ప్రయత్నం చేయడంతో పాటు, షూటింగ్‌ సమయంలో త్రిషను కీర్తి సురేష్‌ అవమానించేలా మాట్లాడటం జరిగింది అంటూ పుకార్లు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే త్రిష సినిమా నుండి తప్పుకుందని అంటున్నారు. ఈ విషయమై కీర్తి సురేష్‌ స్పందించింది. ‘సామి 2’ చిత్రం నుండి త్రిష తప్పుకోవడానికి తనకు ఎలాంటి సంబంధం లేదని, అసలు ఆమెకు నాకు కాంబినేషన్‌ సీన్స్‌ లేకపోవడంతో ఇద్దరం కలిసి ఒక్కరోజు కూడా షూటింగ్‌లో పాల్గొనలేదని చెప్పుకొచ్చింది. మీడియాలో తన గురించి లేనిపోని వార్తలు రాస్తున్నారంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది. మొత్తానికి కీర్తి సురేష్‌ ఇచ్చిన క్లారిటీపై తమిళ మీడియా సంతృప్తి చెందినట్లుగా లేదు. అందుకే వివాదంను కంటిన్యూ చేస్తూ ఉన్నారు. ఈ విషయమై త్రిష ఎలా స్పందిస్తుంది అనేది చూడాలి.