కిక్ కోసం ఇంత పని చేశారా??

death

ఆంధ్రప్రదేశ్ లో ఘోరం జరిగింది. విశాఖపట్టణం జిల్లాలో కిక్కు కోసం స్పిరిట్ తాగి ఐదుగురు మృతి చెందిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. స్పిరిట్‌ను నాటుసారాగా పొరపాటుబడి తాగేయడంతో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. కశింకోట గోవిందరావు కాలనీకి చెందిన కూనిశెట్టి ఆనందరావు తన స్నేహితులతో కలిసి పార్టీ చేసుకుందామనుకున్నాడు. మంచి కిక్ కోసం మత్తు ఎక్కువగా ఉంటుందని స్పిరిట్ తీసుకొచ్చాడు.. అలాగే.. స్నేహితులంతా దాన్ని తాగేశారు. డోసు పెరిగిందో ఏమో తాగిన వాళ్లంతా తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. వీరిలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఇద్దరు ఆస్పత్రిలో చికిత్సపొందుతూ కన్నుమూశారు.

కాగా ఈ ఘటన పై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని ఆ ప్రాంతాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం తరలించారు. వీరికి స్పిరిట్ ఎక్కడి నుంచి వచ్చిందనే అంశంపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. మృతి చెందిన వారిని వడిసెల నూకరాజు, కూనిశెట్టి ఆనంద్, పెతకం శెట్టి అప్పారావులుగా గుర్తించారు. చనిపోయిన ముగ్గురిలో ఇద్దరు ఆటో డ్రైవర్లు, ఒకరు లారీ క్లీనర్ గా తెలుస్తోంది. ఆస్పత్రిలో ప్రాణాపాయంతో కొట్టుమిట్టాడుతున్న మాణిక్యం రోజువారీ కూలిపనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.