ఆ పాఠం మళ్లీ అప్పజెప్పిన లక్ష్మీపార్వతి.

Lakshmi Parvathi Repeated The Same Dialogues

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

లక్ష్మీపార్వతి ఎక్కడికెళ్లినా ఏమి మాట్లాడతారో అందరికీ తెలుసు. పదాలు మారతాయేమోగానీ భావం ఒక్కటే. టీడీపీ అధినేత చంద్రబాబుని తిట్టడం, జగన్ ని పొగడటం. ఇప్పుడు ప్లీనరీ లోను ఆమె తనకు అలవాటైన ఆ పనిని, తనకు వైసీపీ అప్పగించిన పనిని జాగ్రత్తగా పూర్తి చేశారు. ఇంతకీ ఆమె ప్లీనరీలో ఏమన్నారో చూద్దాం.

ప్రజల హృదయాల్లో చెరగనిముద్ర వేసుకున్న వ్యక్తి వైఎస్‌ఆర్‌ అని, ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచి పొట్టన పెట్టుకున్న ఘనుడు చంద్రబాబు అని వైసిపి నేత లక్ష్మిపార్వతి అన్నారు. వైసిపి ప్లీనరీ సభలో ఆమె మాట్లాడుతూ చంద్రబాబు హత్యా రాజకీయాలు ఎన్టీఆర్‌తో మొదలయ్యాయని చంద్రబాబు ఆగడాలను ఆమె ఎండగట్టారు. రాజశేఖర్‌రెడ్డి చనిపోయినా ప్రజల గుండెల్లో బతికుంటే..బతికున్న అడ్రస్‌ లేకుండా పోయిన వారిలో చంద్రబాబు ముందుటారన్నారు.