జగన్ ని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన వైసీపీ నేతలు.

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

 Jagan Caught Redhanded By YCP Leaders

వైసీపీ ప్లీనరీ నిర్వహణలో లోపాలు కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి. ఒకే వేదిక మీద ఉండి కూడా వక్త ఏమి చెప్పాలో,ఎలా మాట్లాడాలో మైక్ ముందుకు వచ్చే దాకా ముందుగా నిర్దేశించలేకపోయారు. తీరా మైక్ ముందుకు వచ్చాక చంద్రబాబుని బాగా తిట్టమని జగన్ సందేశం మోసుకొచ్చి మీడియా కి దొరికిపోయారు వైసీపీ నేతలు. చంద్రబాబుని తిట్టడానికే జగన్ వైసీపీ ప్లీనరీ పెట్టాడని టీడీపీ నాయకులు చేస్తున్న విమర్శలో నిజముందని తేలింది . ఇంతకీ అసలు మ్యాటర్ ఏమిటంటే …వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజా ప్రసంగించడానికి మైక్ ముందుకు వచ్చారు. ఆమె ప్రసంగం మొదలెట్టే ముందు రోజా దగ్గరికి వచ్చిన సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు చంద్రబాబుని బాగా తిట్టమని జగన్ చెప్పినట్టు చెప్పడం మైక్ లో వినిపించింది. వైసీపీ నేతల బండారాన్ని బయటపెట్టింది. ఈ విధంగా జగన్ ని ఆ పార్టీ నేతలే రెడ్ హ్యాండెడ్ గా పట్టించారు. కావాలంటే మీరు కూడా ఆ వీడియో మీద ఓ లుక్ వేయండి…