రామోజీ గారి అంత్యక్రియల గురించి తాజా సమాచారం…!

Latest information about Ramoji's funeral...!
Latest information about Ramoji's funeral...!

తెలుగు నేల గర్వించదగ్గ అతి కొద్ది మంది ప్రముఖుల ల్లో ఈనాడు అధినేత చెరుకూరి రామోజీరావు గారు కూడా ఒకరు. మరి ఇన్నేళ్ల సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో రంగాలల్లో సేవలందించిన తాను నేడు శివైక్యం అయ్యారు. అయితే నేడు వారి స్వగృహం వద్దనే ప్రముఖుల సందర్శనార్ధం వారి పార్థివ దేహాన్ని కూడా ఉంచారు.

ఈ క్రమంలో దేశ వ్యాప్తంగా అనేకమంది సినీ రాజకీయ ప్రముఖులు వచ్చి వారి నివాళులు అర్పిస్తుండగా వారి అంత్యక్రియలకి సంబంధించి తాజా సమాచారం ఇప్పుడు తెలిసింది. శ్రీ రామోజీరావు గారి అంత్యక్రియలని అధికార లాంఛనాలతో నిర్వహించాలి అని తెలంగాణా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది .

Latest information about Ramoji's funeral...!
Latest information about Ramoji’s funeral…!

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య సమావేశం నిమిత్తం ఢిల్లీ కి వెళ్లారు …. కానీ అక్కడ ఉన్నప్పటికీ అక్కడ నుంచే ఆదేశాలు జారీ చేశారు. కాగా ఏర్పాట్లు పర్యవేక్షించాల్సిందిగా రంగారెడ్డి కలెక్టర్, సైబరాబాద్ కమిషనర్ కి సీఎస్ ద్వారా రేవంత్ ఆదేశాలు జారీ చేశారు. ఇలా రేపు ఉదయం రామోజీ గారి ఫిలిం సిటీ లోనే 9 నుంచి 11 గంటల సమయం మధ్యలో వారి అంత్యక్రియలు కూడా జరుగనున్నాయి.