ఎంపీ మాగంటి ఆరోగ్య పరిస్థతి లేటెస్ట్ అప్డేట్

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

చింతల పూడిలో సైకిల్‌ యాత్రలో పాల్గొంటోన్న టీడీపీ ఎంపీ మాగంటి బాబుకు నిన్న గుండెనొప్పికి గురయిన సంగతి తెలిసిందే. దీంతో వెంటనే ఆయనను ఏలూరులోని ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. కాగా మెరుగైన చికిత్స కోసం మాగంటి బాబును విజయవాడలోని రమేష్ ఆసుపత్రికి టీడీపీ శ్రేణులు, కుటుంబ సభ్యులు తరలించారు. కాగా ఎండ ఎక్కువగా వుండటం అదీ కాక నాలుగు గంటలకు పైగా సైకిల్ యాత్రలో పాల్గొనటంతో గుండెనొప్పికి గురయినట్లుగా తెలుస్తోంది. అయితే ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు రమేష్ హాస్పిటల్ వర్గాలు ఒక ప్రకటన విడుదల చేశాయి. ఇదే విషయాన్ని మాగంటి బాబు కుమారుడు పశ్చిమ గోదావరి జిల్లా తెలుగు యువత అధ్యక్ష్యుడు రాంజీ ధ్రువీకరించారు. మరో మూడు రోజుల పాటు ఆయన్ని అబ్జర్వేషన్ లో ఉంచారని త్వరలో మునుపటిలా మన ముందుకు వస్తారని ఆయన పేర్కొన్నారు. ఆయన ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని ఆయన పేర్కొన్నారు. అలాగే తన తండ్రి బాగుండాలని ప్రార్ధించిన వారికి ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

To All Those Concerned , My Father Who Suffered From Heart Stroke This Afternoon Is Kept Under Observation For Three…

Publiée par Maganti Ram Chandran sur vendredi 4 mai 2018