పెళ్లిలో ఘోరం: మద్యం తాగి బావమరిదిని చంపేసిన వరుడి ఫ్రెండ్స్….

marriage

ఉత్తరప్రదేశ్ లో ఘోరం చోటుచేసుకుంది. పెళ్లి వేడుకలో జరిగిన ఓ గొడవ బాలుడి హత్యకు కారణమైంది. భోజనాల వద్ద వరుడి స్నేహితులు అతిగా ప్రవర్తించడంతో రెండు వర్గాల మధ్య గొడవ సంభవించింది. దీంతో వధువు తమ్ముడు హత్యకు గురయ్యాడు. ఫ‌రూఖాబాద్‌లోని అట్‌సైని ప‌హ‌ర్‌పూర్ గ్రామానికి చెందిన‌ మ‌నోజ్ కుమార్‌కు గోవింద్‌పూర్ అదుల్లాపూర్‌కు చెందిన యువ‌తితో సోమ‌వారం సాయంత్రం పెళ్లైంది. ఈ పెళ్లి తర్వాత అదే రోజు రాత్రి బ‌రాత్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.

అయితే ఈ సమయంలో ఫుల్లుగా మద్యం సేవించిన వరుడి ఫ్రెండ్స్ భోజనాల వద్ద గొడవకి దిగారు. భోజనాలు బాగోలేవంటూ వధువు తరుఫున వారు గొడవ చేశారు. అలాగే.. మద్యం మత్తులో తుపాకీతో కాల్పులు కూడా జరిపారు. ఆ తర్వాత పెళ్లి కొడుక్కి మంచినీళ్లు ఇవ్వడానికి వెళ్లి వధుడు తమ్ముడిని వారు బలవంతంగా కారులో ఎక్కించుకొని తీసుకుపోయారు. అడ్డొచ్చిన బంధువులను కూడా ఢీకొటట్డంతో ఆ ప్రమాదంలో ముగ్గురు మహిళలు గాయపడ్డారు. దీంతో వారిని లోహియా జిల్లా ఆస్పత్రికి తరలించారు.

అంతేకాకుండా వధువుతో పాటు ఆమె తల్లిదండ్రులు, బంధువులు కూడా మనోజ్‌కుమార్‌కు ఫోన్ చేసి బాలుడిని విడిచిపెట్టాలని ఎన్నిసార్లు కోరినా వారు విడవలేదు సరికదా.. మంగళవారం తెల్లవారుజామున 3 గంటలకు బాలుడి మృతదేహాన్ని ఇంటివద్ద పడేసి వెళ్లిపోయారు. దీంతో గొంతు పిసికినట్లు గుర్తులు కనిపించడంతో కుటుంబసభ్యులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు అందించారు. కాగా ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కాగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.