మోదీ పర్యటనకు భారీ ఏర్పాట్లు

Narendra Modi
Narendra Modi

ప్రధాని నరేంద్ర మోదీ అమరావతి పర్యటనకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ఎక్కడా పొరపాట్లకు తావు లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నారు. మే 2వ తేదీన రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమంలో ప్రధాని పాల్గొంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన పర్యటన ఏర్పాట్ల నిమిత్తం ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం సోమవారం విజయవాడలోని జల వనరుల శాఖ రైతు శిక్షణా కేంద్రంలో సమావేశమైంది. ప్రధాని కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అన్ని శాఖల అధికారులు పూర్తి సమన్వయంతో పనిచేయాలని సూచించారు.