పాతబస్తీలో దారుణ.. తండ్రి కళ్లలో కారం.. ఆపై కూతురు కోసం..

తెలంగాణలోని హైదరాబాద్‌ పాతబస్తీలో దారుణం చోటుచేసుకుంది. ఓల్డ్ సిటీలోని హుమాయూన్‌నగర్‌ పోలీస్ స్టేషన్‌ పరిధిలో తన తండ్రితో కలిసి బయటకు వెళ్తున్న ఓ యువతిని కిడ్నాప్‌ చేసేందుకు యత్నించారు దుండగులు. మొదట యువతి తండ్రిపై బాటిల్స్‌తో దాడిచేసిన దుండగులు.. ఏకంగా కళ్లల్లో కారం కొట్టారు. ఆ తర్వాత యువతిని లాక్కెళ్లేందుకు యత్నించారు. వెంటనే తేరుకున్న బాధితురాలు… గట్టిగా కేకలు వేయడంతో.. ఘటనాస్థలం నుంచి దుండగులు పారిపోయారు.

అయితే బాధితుడు మహమ్మద్ షరీఫ్… మాసాబ్ ట్యాంక్‌ శాంతినగర్ కాలనీ వాసి. కాగా ఇలాంటి ఈ ఘాతుకానికి యత్నించింది సల్మాన్ మీర్జా బేగ్ అతని నలుగురు స్నేహితులుగా పోలీసులు గుర్తించారు. అయితే యువతిని కిడ్నాప్‌ చేసేందుకు యత్నించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు కావడంతో.. కేసు నమోదు చేసిన పోలీసులు… దుండగుల కోసం తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టారు. హైదరాబాద్‌లో ఈ ఘటన చోటు చేసుకోవడం సర్వత్రా కలకలం రేపుతోంది.