జగన్ సర్కార్ సేవలకు బ్రిటన్ వాసి ఫిదా…

కీలక నిర్ణయం తీసుకున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి

ఆంధ్రప్రదేశ్ ప్రదేశ్ ప్రభుత్వం కరోనా వైరస్ ను ఎంతో తెలివిగా ఎదుర్కొనేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తుంది. అందుకోసం ముఖ్యంగా వాలెంటీర్ వ్యవస్థను పటిష్టపరచింది. వారిసేవలు ఎనలేనివిగా ప్రపంచమంతా మెచ్చుకుంటుంది. తాజాగా ఆంధ్రప్రదేశ్ లోని జగన్ సర్కార్ ను, అధికారులను బ్రిటన్ వాసి ప్రశంసల వర్షం కురిపించాడు. తిరుపతిలోని క్వారంటైన్‌ కేంద్రంలో ఉన్నప్పుడు ప్రభుత్వం చేసిన సేవలు, చూసిన విధానానికి ఆయన ఫిదా అయ్యారు. మళ్లీ తాను తిరుపతి శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకుంటానని…. తనను బాగా చూసుకున్న అధికారులను మళ్లీ కలుస్తానని తెలిపారు.

అదేవిధంగా కరోనా క్వారంటైన్ సెంటర్లలో ఏపీ ప్రభుత్వం చేపట్టిన సౌకర్యాలు అద్భుతంగా ఉన్నాయని తెలిపారు. ఇందుకు సంబంధించి అతడు ఓ లేఖ రాశారు. తనను ఉంచిన తిరుపతి శ్రీపద్మావతి నిలయం వద్ద ఏర్పాటు చేసిన క్వారంటైన్ కేంద్రం చాలా బాగా ఉందని అన్నారు. అక్కడ వైద్య సిబ్బంది, అధికారులు బాగా చూసుకున్నారని.. క్వారంటైన్ సెంటర్‌లో బ్రేక్ ఫాస్ట్, లంచ్, డిన్నర్ అద్భుతంగా ఉన్నాయని తెలిపారు. అంతేకాకుండా క్వారంటైన్‌ సెంటర్‌లో గాలి, వెలుతురు వచ్చేలా విశాలంగా చాలా పరిశుభ్రమైన బెడ్‌లు ఉన్నాయన్నారు. చుట్టుపక్కల పరిసరాలు పరిశుభ్రంగా ఉన్నాయని అన్నారు. గదిలో నుంచి బయటకు చూస్తే తిరుపతి ప్రకృతి కనువిందు చేసిందని.. వైద్య సిబ్బంది కూడా చాలా స్నేహపూర్వకంగా ఉన్నారని.. టీ, స్నాక్స్, మంచినీళ్లు, వాట్సాప్‌లో అడిగిన వెంటనే ఏమైనా అవసరం ఉంటే అందించారని తెలిపారు. అక్కడ డాక్టర్లు కూడా సేవలు బాగా చేశారని.. ఎలాంటి ఆందోళన చెంద వద్దని అందరిలో ధైర్యం చెప్పారని కూడా వివరించారు.

కాగా బ్రిటన్‌ వేల్స్‌కు చెందిన కల్లీ క్లైవ్ ల్లీ క్లైవ్ బ్రయాంట్ గతేడాది అక్టోబర్‌లో భారత పర్యటనకు వచ్చాడు. తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శనానికి వచ్చిన సమయంలోనే కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ ప్రకటించారు కేంద్రం. కెల్లీ బ్రిటన్ వ్యక్తి కావడంతో మార్చి 24న తిరుపతిలోని పద్మావతి నిలయంలోని క్వారంటైన్‌కు తరలించారు. అయితే క్వారంటైన్ కాలాన్ని పూర్తి చేసుకున్నాడు. ఆయన శాంపిల్స్ పరీక్షించగా.. రెండు సార్లు కరోనా టెస్టుల్లో నెగిటివ్ వచ్చింది. క్వారంటైన్‌లో ఉన్న సమయంలో సేవలకు ఆయన ఫిదా అయ్యారు. మళ్లీ తాను తిరుపతి శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకుంటానని.. తనను బాగా చూసుకున్న అధికారులను మళ్లీ కలుస్తానని స్పష్టం చేయడం విశేషం.