రైతుల కోసం మోదీ కొత్త పథకం

రైతుల కోసం మోదీ కొత్త పథకం

ప్రధాని నరేంద్ర మోదీ సరికొత్త స్కీమ్ తీసుకురాబోతున్నారు. రైతుల కోసం కొత్త పథకాన్ని ఆవిష్కరించబోతున్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అక్టోబర్ 24న ఈ పథకాన్ని లాంచ్ చేస్తారు. అయితే ఇది కేవలం గుజరాత్‌లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. అక్కడి రాష్ట్ర ప్రభుత్వం ఈ స్కీమ్ తీసుకువస్తోంది.

గుజరాత్ రైతుల కోసం మోదీ అక్టోబర్ 24న కిసాన్ సూర్యోదయ యోజన పథకాన్ని తీసుకువస్తున్నారు. కేవలం ఈ కొత్త స్కీమ్ మాత్రమే కాకుండా రెండు ఇతర ప్రాజెక్టులను కూడా లాంచ్ చేయనున్నారు. రైతులకు నిరంతరాయంగా విద్యుత్ అందించడమే కొత్త స్కీమ్ అసలు ఉద్దేశం.

గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపాని ఇటీవలనే కిసాన్ సూర్యోదయ యోజన పథకాన్ని తీసుకువస్తామని ప్రకటించారు. దీన్ని మోదీ రేపు ఆవిష్కరించనున్నారు. ఈ స్కీమ్‌లో భాగంగా రైతులకు ఉదయం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరరకు కరెంటు అందుబాటులో ఉంటుంది.

రాష్ట్ర ప్రభుత్వం కిసాన్ సూర్యోదయ స్కీమ్ కోసం రూ.3,500 కోట్లు కేటాయించింది. ఈ డబ్బులను ట్రాన్స్‌మిషన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు కోసం ఉపయోగిస్తారు. 2022-23 నాటికల్లా ఈ స్కీమ్ పూర్తిగా అందుబాటులోకి వస్తుంది. అప్పటి వరకు విడదల వారీగా పలు ప్రాంతాల్లో అందుబాటులోకి వస్తూ ఉంటుంది.