భర్త మరణాన్ని తట్టుకోలేక భార్య ఆత్మహత్య

భర్త మరణాన్ని తట్టుకోలేక భార్య ఆత్మహత్య

కరోనా అనేకమంది ప్రాణాల్ని బలితీసుకుంటోంది. వైరస్‌తో కొందరు చనిపోతుంటే.. తమకు ఎక్కడ కరోనా వస్తుందోనన్న భయంతో కొందరు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. మరికొందరు తమవారు కరోనాతో చనిపోతుంటే.. ఆ బాధను తట్టుకోలేక మరికొందరు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. తాజాగా భర్త మరణాన్ని తట్టుకోలేక భార్య ఆత్మహత్య చేసుకున్న సంఘటన హైదరాబాద్‌లోని నేరేడ్‌మెట్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వెంకటేష్‌(60), ధనలక్ష్మి(55) దంపతులు సైనిక్‌పురి అంబేద్కర్‌ నగర్‌లో నివాసముంటున్నారు. వెంకటేష్‌ ఏఎస్‌రావు నగర్‌లోని ఉషోదయ సూపర్‌ మార్కెట్‌లో పని చేస్తున్నాడు. వెంకటేష్‌కు కరోనా వచ్చింది. దీంతో కొన్ని రోజులుగా హోం క్వారంటైన్‌లోనే ఉంటున్నాడు. అయితే పరిస్థితి విషమించి గురువారం ఇంట్లోనే మృతి చెందాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ధనలక్ష్మి బిల్డింగ్‌పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. అయితే వీరికి పిల్లలు లేకపోవడంతో.. మృతదేహాలను ఉస్మానియాకు తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.