బైంసాలో విషాదం చోటుచేసుకుంది. ఆర్థిక సమస్యలతో తల్లీ కూతురు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. వివరాల ప్రకారం.. భాగ్యశ్రీ (40) అనే మహిళ 12 ఏళ్ల క్రితం భర్తతో విడిపోయి పార్లర్ నడుపుతూ జీవనం నెట్టుకొస్తుంది. కూతురు సిన్ని (22)ని డాక్టర్ చేయాలనుకుంది.
ఈ నేపథ్యంలో కూతురు చదువు కోసం అప్పులు చేసి మెడిసిన్ చదివిస్తుంది. అయితే ఆర్థిక భారం అధికమవ్వడంతో తల్లీ, కూతురు ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రాథమికంగా అంచనా వేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకున్నారు.