కవలల జననం తల్లి మరణం

కవలల జననం తల్లి మరణం

మేడ్చల్ జిల్లా పీర్జాదిగూడ ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో దారుణం చోటు చేసుకుంది. ప్రైవేట్ హాస్పిటల్ కి డెలివరీ కోసం వెళ్లిన మహిళ కవలలకు జన్మనిచ్చి మరణించింది. దీంతో కుటుంబసభ్యులు మహిళ మృతికి ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని చెబుతున్నారు.సంతోష కుమారి అనే మహిళ డెలివరీ కోసం ఫిర్జాదిగూడలోని ప్రైవేట్ ఆస్పత్రిలో జాయిన్ అయ్యింది. సెప్టెంబర్ 28న ప్రసూతికి వెళ్ళిన సంతోషి కుమారికి ఇద్దరు కవలలు జన్మించారు. ఆ తరువాత ఆమె పరిస్థితి విషమించిందంటూ ఆసుపత్రి యాజమాన్యం ఎల్.బి. నగర్ లో మరో ఆసుపత్రికి తీసుకేళ్లింది. అక్కడ సంతోషి మృతి చెందింది.

దీంతో మృతురాలు అంత్యక్రియలు అనంతరం బంధువులు నిరసనకు దిగారు. అక్టోబరు 28న బందువులు, కుటుంబ సభ్యులు ఆసుపత్రి ముందు తమకు న్యాయం చేయాలంటు మౌన పోరాటం చేస్తున్నారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే సంతోషి కుమారి మృతి చెందిందంటూ బందువులు, కుటుంబ సభ్యులు ఆరోపణలు చేస్తున్నారు. మృతిరాలు సంతోషి కుమారి చావుకు ఆసుపత్రి యాజమాన్యం వేలు రూపాయలు కట్టించుకున్న తీరుపై బందువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హాస్పిటల్ ముందు మౌన పోరాటానికి దిగారు. తమకు న్యాయం చేయాలంటూ మృతురాలి కుటుంబసభ్యులు డిమాండ్ చేస్తున్నారు.