ఆడతనాన్ని చాటుకున్న గొప్ప స్త్రీ: మనవరాళ్ల కోసం కొడుకును చంపిన తల్లి

ఆంధ్రప్రదేశ్ లో రోజురోజుకూ కరోనా కేసులతో పాటు దారుణాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా నెల్లూరు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. నరరూప రాక్షుడిలా మారిన కుటుంబసభ్యులను హతమారుస్తున్న ఓ వ్యక్తిని కన్నతల్లే హతమార్చిన వెలుగు చూసింది. ఆస్తి కోసం కుటుంబసభ్యుల ప్రాణాలు తీస్తున్న ఓ నరరూప రాక్షసుడు చివరకు కన్నతల్లి చేతిలోనే ప్రాణాలు కోల్పోయాడు. తండ్రిని, బామ్మర్దిని, భార్య తాతను చంపేసిన అతడు చివరకు భార్యను, కన్నబిడ్డలనూ హత్య చేసేందుకు అనేకసార్లు ప్రయత్నించాడు. దీంతో మనవరాళ్ల ప్రాణాలు కాపాడేందుకు కన్న కొడుకునే హత్య చేసింది తల్లి. ఆ తర్వీత తానూ ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన నెల్లూరు జిల్లా కోవూరు మండలం గంగవరంలో చోటు చేసుకుంది.

కాగా గంగవరం గ్రామానికి చెందిన వేమిరెడ్డి శ్రీనివాసులురెడ్డి, అనసూయమ్మల కొడుకు గోపాల్‌రెడ్డికి ముగ్గురు కూతుళ్లు. మద్యానికి బానిసైన అతడు నిత్యం భార్యను పిల్లలను వేధిస్తుండటంతో అంతా ఇల్లు ఖాలీ చేసి పుట్టింటికి వెళ్లిపోయారు. ఇరు కుటుంబాల మధ్య వివాదాలు తలెత్తడంతో భార్య తమ్ముడిని హత్య చేసి జైలుకెళ్లాడు. విడుదలైన తర్వాత ఆస్తి కోసం తండ్రినే హతమార్చాడు. కొన్నాళ్లకు భార్య తాత శ్రీనివాసులురెడ్డిని కూడా విషమిచ్చి హత్య చేశాడు. నెల్లూరులోని ఓ అపార్టుమెంటులో నివసిస్తున్న భార్య, కూతుళ్లను కూడా హత్యచేసేందుకు ట్రై చేసి ఫెయిల్ అయ్యాడు. ఆ తర్వాత శ్రీరామనవమి రోజు ఇద్దరు కూతుళ్లను గోపాల్‌రెడ్డి తన ఇంటికి పిలిపించాడు. వారిని హత్య చేసేందుకు పిలిపించాడని అనుమానించిన తల్లి… కొడుకైన గోపాల్‌రెడ్డికి కూల్‌డ్రింక్‌లో పొటాషియం సైనైడ్‌ కలిపి ఇచ్చేసింది. ఆ తర్వాత అదే ద్రావకం తాను కూడా తాగి ఆత్మహత్య చేసుకుంది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.