తల్లిదండ్రులకు అడ్డంగా దొరికిన లవర్స్… చంపేశారు

ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో దారుణం చోటుచేసుకుంది. అర్ధరాత్రి సమయంలో గర్ల్‌ఫ్రెండ్ ను ఇంటికి పిలిచాడు. అదే సమయంలో అమ్మాయి తల్లిదండ్రులకు దొరికిపోవడంతో.. ఆగ్రహంతో యువకుడిని చితక్కొట్టారు. అడ్డొచ్చిన కూతురును కూడా కొట్టి చంపేశారు.

అసలు ఏం జరిగింది అంటే… నలుగురు పిల్లల తండ్రి అర్ధరాత్రి సమయంలో తన మైనర్ గర్ల్‌ఫ్రెండ్ ఇంటికి వెళ్లి ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. అమ్మాయితో రహస్యంగా ఉన్న సమయంలో ఆమె పేరెంట్స్ చూడడంతో విషయం వెలుగు చూసింది. చివరికి ఆ జంట చనిపోయారు. గర్ల్‌ఫ్రెండ్ కుటుంబ సభ్యులు ప్రేమికుల జంటను దారుణంగా కొట్టి చంపేశారు.

కాగా అర్ధరాత్రి రహస్యంగా కన్న కూతురును కలవడంతో అమ్మాయి కుటుంబ సభ్యులు దారుణంగా హత్య చేశారు. ఇది లక్నో నగరంలోని సాదర్‌గంజ్ పరిధి నౌబస్తా కాలనీలో చోటుచేసుకుంది. అబ్దుల్ కరీమ్(25) అనే యువకుడికి పెళ్లై నలుగురు పిల్లలు. కొంతకాలంగా అతను మరో 17 ఏళ్ల బాలికతో ప్రేమ వ్యవహారం నడుపుతున్నాడు. తాజాగా నగరం నిద్రపోతున్న వేళ కరీం ప్రియురాలి ఇంటికి వెళ్లాడు.

కూతురి కోసం ఆమె ప్రియుడు ఇంటికి వచ్చి విషయం ప్రియురాలి కుటుంబ సభ్యులకు తెలిసిపోయింది. కూతురితో రహస్యంగా మాట్లాడుతున్న సమయంలో ఆమె కుటుంబ సభ్యులు ప్రియుడు కరీంని పట్టుకుని మూకుమ్మడి దాడి చేశారు. బాలిక తండ్రి ఉస్మాన్, అన్న డానిష్, బాబాయ్ సులేమాన్, అతని కొడుకు రాణు కర్రలతో కొట్టారు. లాఠీలతో ప్రియుడిని చావబాదుతుంటే ప్రియురాలు అడ్డు వెళ్లింది. ప్రియుడిని కొట్ట వద్దంటూ అడ్డుపడిన కూతురిని కూడా విచక్షణా రహితంగా కొట్టడంతో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.