108 డాక్టర్ పై దాడి.. కారణమదేనా…?

తెలంగాణలోని సూర్యాపేట జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. 108 డాక్టర్‌పై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడటం స్థానికంగా కలకలం రేపుతోంది. సూర్యాపేట జిల్లా అర్వపల్లి మండల పరిషత్ కార్యాలయంలో ఈ ఘటన జరిగింది. అక్కడ నిద్రిస్తున్న 108 డాక్టర్ నిరంజన్‌పై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. అయితే కత్తులతో ఒక్కసారిగా అతనిపై దాడికి దిగారు. దీంతో నిరంజన్‌కు తీవ్ర గాయాలు అయ్యాయి. పరిస్థితి విషమంగా మారడంతో వెంటనే అతడిని చికిత్స నిమిత్తం హైదరాబాద్ ఆస్పత్రికి తరలించారు. వివాహేతర సంబంధమే డాక్టర్‌పై దాడికి కారణమైందని పోలీసులు భావిస్తున్నారు.
కాగా దాడి జరిగిన ప్రాంతంలో క్లూస్ టీం సాయంతో విచారణ చేపట్టారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అయితే దాడికి పాల్పడింది ఎవరన్న విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. నిరంజన్ రెడ్డి వ్యవహార శైలిపై కూడా పోలీసులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తుండటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.