హత్య జరిగిన ఆరేళ్ళకి బయటపడింది

murder revealed after six years

మానవ సంబంధాలు రోజు రోజుకు దిగజారిపోతున్నాయి. కామంతో కళ్లు మూసుకుపోయిన కొందరు హత్యలకు కూడా వెనుకాడటం లేదు. తమిళనాడులో ఓ మహిళ మరిదితో సంబంధం పెట్టుకొని కట్టుకున్నవాడిని కడతేర్చింది. ఆరేళ్ల పాటు పోలీసులకు దొరక్కుండా తప్పించుకు తిరిగి, పాపం పండి ఆ మరిదితో సహా పోలీసులకు దొరికిపోయింది. ఈ ఘటనకు సంబందించిన పూర్తి వివరాల్లోకి వెళితే తమిళనాడులోని కడలూరు హార్బర్ సింగారతోపుకు చెందిన మురుగదాసన్‌కు సునీతతో వివాహయ్యింది. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఉద్యోగం కోసం మురుగుదాసన్ సౌదీ అరేబియా వెళ్లాడు. అతడి భార్య మాత్రం పిల్లలతో సింగారతోపులోనే ఉంటోంది. ఈ క్రమంలో 2013 జనవరి 6న మురుగదాసన్ తన బావమరిది పెళ్లి కోసం సొంత ఊరికి వచ్చాడు. కొద్దిరోజులకు కనిపించకుండా పోయాడు. అతడి ఆచూకీ కోసం ఎంత గాలించినా ఫలితం లేకుండా పోయింది. మురుగదాసన్ పాస్‌పోర్ట్ ఇంట్లోనే ఉండటం, అది జరిగిన కొద్దిరోజులకే సునీతతో పాటూ మరిది కూడా కనిపించకుండా పోయారు. దీంతో మురుగదాసన్ తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు ఏం జరిగిందని ఆరా తీశారు. ఈ ఘటనలో షాకింగ్ విషయాలు వారికి తెలిశాయట. మురుగదాసన్ సౌదీకి వెళ్లిన సమయంలో వదిన సునీతతో ఆమె మరిది సంబంధం పెట్టుకున్నాడు. రోజూ ఇంటికి వెళ్లి ఆమెను కలిసేవాడట. మరిది, వదినల సంబంధం గురించి మురుగదాసన్‌కు తెలిసింది. దీంతో భార్యను అతడు మందలించాడు.. భర్త తమ సంబంధానికి అడ్డొస్తాడని భావించిన సునీత భర్తను హతమార్చాలని భావించింది. మరిదితో కలిసి మురుగదాసన్‌ హత్యకు ప్లాన్ చేసింది. అతడ్ని నమ్మించి దారుణంగా చంపి పాతిపెట్టారు. తర్వాత ఆరేళ్ళ పాటు తప్పించుకు తిరిగిన ఇద్దరూ కేరళలో పోలీసులకు దొరికిపోయారట. ఆరేళ్ళ ఇంటి సమీపంలో పాతి పెట్టిన మురుగదాసన్‌ మృతదేహాన్ని పోలీసులు బయటకు తీసి పోస్టుమార్టంకు పంపారు.