మిస్టరీ వీడింది: 2019 నాటి యువతి హత్య కేసు వీడింది ….

ఉత్తరప్రదేశ్ లో గత సంవత్సరం నుంచి మిస్టరీగా మారి మిగిలి పోయిన ఓ యువతి హత్య కేసును పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. యువతి ప్రియుడే ఆమెను హత్య చేసినట్లు తేల్చారు. పోలీసుల విచారలో భాగంగా పలు ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అసలు ఆ కేసు ఏమిటంటే.. 2019 జూన్‌ 14న ఉత్తరప్రదేశ్‌ మీరట్‌లోని లోహియా గ్రామ పొలంలో తల లేని యువతి శవం పోలీసులకు దొరికింది. చేతులు కూడా తొలిగించి ఉండటంతో హత్య కేసును ఛేదించటం పోలీసులకు చాలా ఇబ్బందిగా మారింది. యువతి శరీరంపై ఆమె.. ప్రియుడి పేర్లు పచ్చబొట్టు పొడిచి ఉండటంతో వాటి ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టారు.

అయితే లుధియానాలో నమోదైన ఓ సెల్‌ నెంబర్‌ ఆధారంగా పోలీసులు కేసును పసిగట్టారు. మృతిరాలిది లుధియానాగా గుర్తించారు. మృతిరాలి తల్లిదండ్రులు ఇచ్చిన మిస్సింగ్‌ కేసు ఆధారంగా ఆమె ప్రియుడికోసం గాలించారు. ఆ తర్వాత ఉత్తరప్రదేశ్ లోహియా గ్రామానికి చెందిన షాకిబ్‌ అనే యువకుడ్ని అదుపులోకి తీసుకొని విచారించగా కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి.

అసలే జరిగింది అంటే.. ఉత్తరప్రదేశ్ లోహియా గ్రామానికి చెందిన షాకిబ్‌ లుధియానాలోని ఓ షాపులో పని చేస్తుండేవాడు. దీంతో అదే ప్రాంతానికి చెందిన ఓ 19 ఏళ్ల యువతితో అతడే అమన్‌ అనే మారు పేరుతో స్నేహాన్ని సాగించాడు. ఇద్దరి స్నేహం కొద్దికాలానికి ప్రేమగా మారింది. ఓ రోజు యువతి ఇంట్లో నగలు తీసుకొని అతడితో పారిపోయింది. ఇద్దరూ డౌరాలాలోని ఓ అద్దె ఇంట్లో కలిసి జీవించసాగారు. ఓ నెల తర్వాత అతడు తమ మతం కాదని ఆమె గ్రహించింది. ఈ విషయంలో ఇద్దరి మధ్య గొడవలు జరిగాయి. దీంతో ఆగ్రహించిన షాకిబ్‌ ఎలాగైనా ఆమెను ఏదో ఒకటి చేయాలని ప్లాన్ వేశాడు. ఈద్‌ రోజున యువతి తాగే కూల్‌ డ్రింక్‌లో మత్తు మందు కలిపి ఇచ్చాడు. ఆమె మత్తులోకి వెళ్లగానే అక్కడికి దగ్గరలోని పొలాల్లోకి తీసుకెళ్లి గొంతునులిమి చంపేశాడు. ఆ తర్వాత తల, చేతులు శరీరం నుంచి వేరుచేసి పారిపోయాడు.