సైన్స్‌ ఫిక్షన్‌ సినిమా చేయడానికి అంగీకరించిన నాని

సైన్స్‌ ఫిక్షన్‌ సినిమా చేయడానికి అంగీకరించిన నాని

టాక్సీవాలా దర్శకుడు రాహుల్‌ సంక్రిత్యాన్‌తో ఒక సైన్స్‌ ఫిక్షన్‌ సినిమా చేయడానికి నాని అంగీకరించాడు. వి పూర్తయిన తర్వాత ‘టక్‌ జగదీష్‌’ కంప్లీట్‌ చేసి సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై తెరకెక్కే సైన్స్‌ ఫిక్షన్‌ చిత్రానికి నాని షిఫ్ట్‌ అవుతాడు. ఆ చిత్రం మొదలు కావడానికి ఇంకా సమయం వుంది కానీ ఈలోగా ప్రీ ప్రొడక్షన్‌ పనులు పూర్తి చేస్తున్నారు. ఈ చిత్రంలో ఎవరైనా ప్రముఖ కథానాయిక వుండాలని నాని భావించాడు. అందుకే కియారా అద్వాని, దిషా పాట్నీ లాంటి బాలీవుడ్‌ తారలని కాంటాక్ట్‌ చేసారు.

దక్షిణాది చిత్రంలో చేయడానికి వారు భారీ పారితోషికం డిమాండ్‌ చేయడంతో నాని మార్కెట్‌ని దృష్టిలో వుంచుకుని సౌత్‌ హీరోయినే బెస్ట్‌ అని డిసైడ్‌ అయ్యారు. హీరోయిన్‌ ప్రత్యేకంగా వుండాలి కనుక సాయి పల్లవి అయితే బెస్ట్‌ అని నాని సూచించాడట. ఆమెని సంప్రదించి కథ వినిపించారని, ఇంకా ఆమె డేట్స్‌ ఇవ్వలేదు కానీ ఈ చిత్రం చేయడానికి అంగీకరించిందని సమాచారం. ఎంసిఏ తర్వాత నాని, సాయి పల్లవి కలిసి నటించే చిత్రమిదే అవుతుంది కనుక బిజినెస్‌ క్రేజ్‌ పరంగా అదో బోనస్‌ అవడం ఖాయం.