జగన్‌పై నారా లోకేశ్ సీరియస్ కామెంట్స్

జగన్‌పై నారా లోకేశ్ సీరియస్ కామెంట్స్

ఏపీ సీఎం జగన్‌పై నారా లోకేశ్ సీరియస్ కామెంట్స్ చేశారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల ద్రోహి గారు అంటూ మండిపడ్డారు. ఉత్తరాంధ్ర యువత ఉపాధి పొందుతున్న ఐటీ కంపెనీలను విశాఖ నుండి హైదరాబాద్ కు తరిమేస్తున్నారు. ఐటీ సెజ్ ఖాళీ చేయిస్తున్నారు. మూడు ముక్కల రాజధాని వస్తుంది అంటూ విశాఖకు వచ్చేందుకు సిద్ధమైన పెద్ద కంపెనీలను ఛీ కొట్టారు. రాయలసీమకి వస్తా అన్న ఎలక్ట్రానిక్స్ కంపెనీలను రాకుండా చేసి అభివృద్ధికి ఆటంకంగా మారారని ఆరోపించారు.

అంతేకాదు కర్నూలుకి హై కోర్టు తరలించే ప్రక్రియ గురించి ఆలోచిస్తాం అంటూ మరో బిస్కెట్ వేసి రాయలసీమ వాసులను మోసం చేస్తున్నారు. మూడుముక్కలాట తప్ప ఉత్తరాంధ్ర, రాయలసీమ అభివృద్ధి కోసం ఏం చేస్తారో చెప్పారా జగన్ గారు అంటూ ప్రశ్నించారు. మీ స్వార్థం కోసం కులం, మతం, ప్రాంతం పేరుతో ప్రజలు కొట్టుకొని చావాలా అని అన్నారు.