National Politics: దేశ ప్రజలకు హెచ్చరిక.. హెపటైటిస్‌ కేసుల్లో భారత్‌కు రెండో స్థానం

National Politics: Warning to the people of the country.. India ranks second in hepatitis cases
National Politics: Warning to the people of the country.. India ranks second in hepatitis cases

హెపటైటిస్‌- బి, సి కేసులపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఆందోళన వ్యక్తం చేసింది. ప్రపంచ వ్యాప్తంగా వైరస్‌ హెపటైటిస్‌ వల్ల చనిపోతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోందని పేర్కొంది. మరణాల విషయంలో ఇది క్షయ వ్యాధి స్థాయిలో ఉందని తెలిపింది. హెపటైటిస్‌ – బి, సి కేసుల్లో చైనా మొదటి స్తానంలో ఉండగా, భారత్‌ రెండో స్థానంలో ఉందని WHO తాజా నివేదిక వెల్లడించింది. 2022లో భారత్‌లో ఈ రుగ్మత బాధితులు 3.5 కోట్ల మంది ఉన్నారని తెలిపింది.

ప్రపంచవ్యాప్తంగా 2022లో 25.4 కోట్ల మంది హెపటైటిస్‌-బి, 5 కోట్ల మంది హెపటైటిస్‌-సి బాధితులు ఉండగా.. చైనాలో ఈ రెండు రకాలు కలిసి 8.3 కోట్ల కేసులు ఉన్నట్లు డబ్ల్యూహెచ్ఓ నివేదిక పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా నమోదైన హెపటైటిస్‌ కేసుల్లో ఇవి 27.5 శాతంగా తెలిపింది. భారత్‌లో 2.98 కోట్ల హెపటైటిస్‌- బి కేసులు, 55 లక్షల హెపటైటిస్‌- సి ఇన్‌ఫెక్షన్లు నమోదయ్యాయని, ప్రపంచవ్యాప్తంగా వెలుగుచూసిన కేసుల్లో ఇవి 11.6 శాతం అని వెల్లడించింది.