మంత్రి పదవికి సిద్ధూ రాజీనామా!

navjoth singh siddhu resigns for minister post

పంజాబ్‌కు చెందిన కాంగ్రెస్ నేత నవ్‌జ్యోత్ సింగ్ సిద్ధూ తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. జూన్ 10నే రాజీనామా లేఖను పార్టీ అధిష్ఠానానికి పంపినట్లు ఆదివారం ట్విట్టర్‌లో వెల్లడించారు. తన రాజీనామా లేఖను కూడా అందులో పోస్ట్ చేశారు. 2017 పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు సిద్ధూ బీజేపీ నుంచి కాంగ్రెస్‌లో చేరారు. ఆ పార్టీ విజయం సాధించడంతో మంత్రి వర్గంలో కీలకమైన స్థానిక సంస్థలు, పర్యాటకం, సాంస్కృతిక శాఖలు ఆయనకు దక్కాయి. కాగా పంజాబ్ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్, మంత్రి సిద్ధూ మధ్య తొలి నుంచి మాటల యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే.