“సాయి పల్లవిపై నెటిజన్స్ ఆగ్రహం.. వైరల్ అవుతున్న వివాదం!”

"Netizens are angry with Sai Pallavi.. Controversy going viral!"
"Netizens are angry with Sai Pallavi.. Controversy going viral!"

మన టాలీవుడ్ సహా సౌత్ లో కూడా బాగా పాపులర్ అయ్యినటువంటి స్టార్ హీరోయిన్స్ లలో నాచురల్ నటి సాయి పల్లవి కూడా ఒకరు. మరి సాయి పల్లవి హీరోయిన్ గా ఇప్పుడు పాన్ ఇండియా వైడ్ మూవీ లు చేస్తుంది కానీ లేటెస్ట్ గా సాయి పల్లవి ఊహించని విధంగా భారీ ఎత్తున నెగిటివిటీ ని ఎదుర్కోవాల్సి వస్తుంది.

ఇది వరకు సాయి పల్లవి ఎలాంటి కాంట్రవర్సీ లలో ఇరుక్కున్న దాఖలాలు లేవు కానీ ఆమె గతంలో చేసిన ఒక ఇంటర్వ్యూలో షాకింగ్ వ్యాఖ్యలు ఇప్పుడు నేషనల్ వైడ్ గా అటెన్షన్ అందుకున్నాయి. మన దేశపు సైన్యాన్ని పాకిస్తాన్ వారు టెర్రరిస్ట్ లు అనుకుంటారు అని, భారత సైన్యం, పాకిస్తాన్ సైన్యం ఒకటే అని అంటూ ఆమె చేసిన కామెంట్స్ పట్ల నెటిజన్స్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

"Netizens are angry with Sai Pallavi.. Controversy going viral!"
“Netizens are angry with Sai Pallavi.. Controversy going viral!”

ఎప్పుడో “విరాటపర్వం” మూవీ సమయంలో ఈమె చేసిన కామెంట్స్ ఇపుడు వైరల్ అవ్వడం మొదలయ్యాయి. కొంతమంది అయితే దీనిపై సాయి పల్లవి క్షమాపణ చెప్పి వివరణ ఇవ్వాలి అని కూడా ఫైర్ అవుతున్నారు. దీనితో సాయి పల్లవి ఊహించని విధంగా భారీ ఎత్తున నెగిటివిటీ ని ఎదుర్కోవాల్సి వచ్చింది.