నిత్య అవసరాల షాపుల వద్ద కొత్త నిబంధనలు: నిత్యావ‌స‌ర దుకాణాల మూసివేత‌పై స్పష్టత….

కరోనా మహమ్మారి ప్రజలను అతలాకుతలం చేస్తుంది. రోజురోజుకూ దేశంలో కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. అలాగే ఇరు తెలుగు రాష్ట్రాల్లో కూడా కరోనా తీవ్రంగా విజృంభిస్తోంది. హైద‌రాబాద్‌ నగరంపై కరోనా వైరస్‌ చాలా వేగంగా ముసురుకుంది. వారం రోజుల క్రితం రాజధాని నగరంలో కరోనా ఉధృతి కాస్త తగ్గుముఖం పట్టినట్టే పట్టి తిరిగి ఎక్కువవుతుంది. చిన్నారులకు, పసికందులను కూడా కరోనా కాటేస్తోంది.

అయితే లాక్‌డౌన్‌ ను ప్రభుత్వం పటిష్టంగా అమలు చేసేలే చర్యలు తీసుకుంటుంది. ప్రజలను కాపాడాల్సిన పోలీసులు కూడా కరోనా బారిన పడుతున్నారు. పిజ్జాబాయిలు, పోలీసు కానిస్టేబుల్స్‌, సెక్యూరిటీ గార్డులు, వైద్యులు కూడా కరోనా బారిన పడుతున్నారు. దీంతో నగర వాసులు బెంబేలెత్తిపోతున్నారు. క‌రోనా చాలా వేగంగా విస్త‌రిస్తోందని న‌గ‌రంలో లాక్‌డౌన్ మరింత కఠినంగా అమలు చేస్తున్నారు. గుర్తింపు కార్డు లేనిదే రోడ్ల మీదకు ఎవ్వరినీ అనుమతించబోమని పోలీసులు ఇప్పటికే స్పష్టం చేశారు. అయితే.. లాక్‌డౌన్ కార‌ణంగా పలుచోట్ల కిరాణా దుకాణాలను కొన్ని గంటల పాటే అనుమతిస్తారని ప్రచారం జరుగుతోంది. ఉదయం 11 గంటల తర్వాత షాపులు మూసివేస్తారని సోషల్ మీడియాలో పుకార్లు షికారు చేస్తున్నాయి. దీనిపై హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ క్లారిటీ ఇచ్చారు. నిత్యావసరాల దుకాణాలు మూసివేయాలని ఎలాంటి ఉత్తర్వులూ ఇవ్వలేదని తెలిపారు. అలాగే… సమయానికంటే ముందే నగరంలో దుకాణాలు మూసి వేయబోమని.. నిత్యావసరాల సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకే సాయంత్రం వరకు షాపులకు అనుమతించామని సీపీ అంజనీకుమార్ వివరించారు.

అంతే కాక షాపు బయట కనీసం మూడు అడూగుల దూరం పాటించేలా బాక్సులు ,లేదా సర్కిల్స్ లను గీసి ప్రజలను ఆ బాక్సుల వద్దే ఉండి కనీస దూరం పాటించేలా జాగ్రత్తలను చేపట్టాలని ఆదేశించారు. ఇలాంటి నిబంధనలను ఉల్లంఘించి ఏ షాపులోనైన ఎక్కువ జనాభా ఉంటే షాపు లైసెన్సులు రద్దు చేయనున్నట్లు పోలీసు అధికారులు వెల్లడించారు.