కేసీఆర్ కోరిక ఫలించింది…కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది…!

New zonal policy In Telanagana

తెలంగాణలో నూతన జోన్ల వ్యవస్థకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ కేంద్రం తాజాగా గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. గత కొద్దిరోజులుగా కేసీఆర్ ఈ కొత్త జోన్ల వ్యవస్థ కోసం కేంద్రాన్ని ఒత్తిడి చేస్తున్నారు. అందుకే ఆయన రెండు నెలల సమయంలో ఢిల్లీకి అనేక సార్లు వెళ్లి వచ్చారు. తాజాగా ఢిల్లీ వెళ్ళిన ఆయన మోడీ చేత ఈ జోన్ల వ్యవస్థకు ఓకే చెప్పించి ఇప్పుడు రాష్ట్రపతి చేత కూడా ఆమోద ముద్ర వేయించుకున్నారు. ఏడు జోన్లు, రెండు మల్టీ జోన్ల వ్యవస్థకు తాజాగా కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. దీంతో ఇప్పటి వరకూ అమల్లో ఉన్న విధానం ప్రకారం 70 శాతం పోస్టులను 95 శాతం 30 శాతం పోస్టులను 5 శాతం చేశారు. దీని వల్ల స్థానిక అభ్యర్థులు ఇక నష్టపోరు. గతంలో రాష్ట్రస్థాయి పోస్టులకు 50 శాతం లోకల్, 50 శాతం ఓపెన్ కేటగిరీ ఉండేది. కానీ ఇక నుంచి ఈ పోస్టులను ప్రమోషన్ల ఆధారంగా స్థానికులతోనే భర్తీ చేయనున్నారు.

kcr-modi
కాళేశ్వరం జోన్ : భూపాలపల్లి మంచిర్యాల, ఆసిఫాబాద్ , పెద్దపల్లి జిల్లాలు

బాసర జోన్ : ఆదిలాబాద్ , నిర్మల్, నిజామాబాద్ , జగిత్యాల

రాజన్న జోన్ : కరీంనగర్, సిద్దిపేట, సిరిసిల్ల, కామారెడ్డి, మెదక్

భద్రాద్రి జోన్ : కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్ రూరల్, అర్బన్

యాదాద్రి జోన్ : సూర్యాపేట, నల్గొండ, యాదాద్రి భువనగిరి, జనగామ

చార్మినార్ జోన్ : హైదరాబాద్ , రంగారెడ్డి, మేడ్చల్ , సంగారెడ్డి

జోగులాంబ జోన్ : మహబూబ్ నగర్ , వనపర్తి, గద్వాల, నాగర్ కర్నూల్, వికారాబాద్

మల్టీ జోన్ కాళేశ్వరం : కాళేశ్వరం, బాసర, రాజన్న, భద్రాద్రి జోన్లు

మల్టీ జోన్ యాదాద్రి : యాదాద్రి, చార్మినార్ , జోగులాంబ జోన్లు

kcr-rastapathi

కొత్త జోనల్ వ్యవస్థ ప్రకారం… అన్ని శాఖల్లోనూ జిల్లా, జోనల్, మల్టీ జోనల్ పోస్టులను వర్గీకరించి, సర్వీస్ నిబంధనలు మార్చుకుని సిద్దంగా ఉండాలని ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం అధికారులకు ఉత్తర్వులు ఇచ్చింది. ఇప్పటి వరకూ నాలుగో తరగతి నుంచి పదో తరగతి వరకు వరుసగా నాలుగేళ్లు ఎక్కడ చదివితే ఆ జిల్లానే స్థానికతగా పరిగణిస్తారు. కానీ ఇక నుంచి ఏడో తరగతి వరకు వరుసగా నాలుగేళ్లు ఎక్కడ చదివితే అక్కడే స్థానికులు అవుతారు.