బైక్ మీద వెళుతుండ గానే భర్త గొంతుకోసిన నవ వధువు

newly married wife slashes throat of husband at Srikakulam district

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

శ్రీకాకుళంలో మరో స‌రస్వ‌తి వెలుగుచూసింది. పెళ్ల‌యిన 20 రోజుల‌కే భ‌ర్త‌పై భార్య హ‌త్యాయ‌త్నానికి పాల్ప‌డింది. భ‌ర్త‌ను హ‌త్య చేయ‌డానికి ఆమె ఎంచుకున్న మార్గం ఒళ్లు గ‌గుర్పొడిచేలా చేస్తోంది. వివ‌రాల్లోకి వెళ్తే…సంత‌బొమ్మాళి మండ‌లం న‌ర్సాపురం పంచాయితీ మాల న‌ర్సాపురం గ్రామానికి చెందిన 23 ఏళ్ల న‌వీన్ కుమార్ కు గొద‌లాం గ్రామానికి చెందిన 19 ఏళ్ల నీలిమ‌తో ఈ నెల 9వ తేదీన పెళ్లిజ‌రిగింది. సోమ‌వారం సాయంత్రం నీలిమ స్వ‌గ్రామం గొద‌లాం నుంచి న‌ర్సాపురం వైపు బైక్ పై వెళ్తుండ‌గా…కోట‌బొమ్మాళి రైలు నిల‌యం స‌మీపంలో నీలిమ అక‌స్మాత్తుగా భ‌ర్త‌పై వెన‌క నుంచి చాకుతో దాడిచేసింది. మెడ భాగం తెగి తీవ్రంగా గాయ‌ప‌డిన న‌వీన్ కుమార్ బైక్ నుంచి కింద‌ప‌డిపోయాడు. వెంట‌నే నీలిమ అక్క‌డి నుంచి ప‌రార‌యింది.

న‌వీన్ కుమార్ ను స్థానికులు ముందుగా కోట‌బొమ్మాళి సామాజిక ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ప్రాథమిక చికిత్స అనంత‌రం శ్రీకాకుళం రిమ్స్ కు త‌ర‌లించారు. న‌వీన్ కు మెడ‌తో పాటు చేయి, కాలిపై గాయాల‌య్యాయి. మెడ భాగం లోతుగా కోసుకుపోవ‌డంతో ప‌రిస్థితి ప్ర‌మాద‌క‌రంగా ఉంద‌ని వైద్యులు చెప్పారు. మ‌రోవైపు నీలిమ‌ను సంత‌బొమ్మాళి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నీలిమపై ఆమె త‌ల్లి మంగ‌మ్మ‌, న‌వీన్ త‌ల్లిదండ్రులు ఆగ్ర‌హం వ్య‌క్తంచేస్తున్నారు. ప్రేమ వ్య‌వహారమే నీలిమ దుశ్చ‌ర్య‌కు కార‌ణ‌మ‌న్న అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. నీలిమ తండ్రి కొంత కాలం క్రితం మృతిచెందారు. ఆమె సోద‌రుడు డిగ్రీ చ‌దువుతున్నాడు. పేదరిక నేప‌థ్యం కావ‌డంతో ఈమె వివాహానికి స్థానికులు సాయ‌మందించారు. అయితే ఈ వివాహం నీలిమ‌కు ఇష్టం లేద‌ని, పెళ్లి స‌మ‌యంలో ఆమె తీవ్రంగా వ్య‌తిరేకించిన‌ప్ప‌టికీ కుటుంబ స‌భ్యులు బ‌ల‌వంతంగా పెళ్లిచేశార‌ని గొద‌లాం గ్రామ‌స్థులు చెబుతున్నారు. సంత‌బొమ్మాళి ఎస్సై రామారావు ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదుచేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు.