‘జై లవకుశ’ ఫుల్‌ క్లారిటీ వచ్చేసింది…

NTR gives full clarity about jai lava kusa movie

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

నందమూరి ఫ్యాన్స్‌ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్న ‘జై లవకుశ’ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుంది. ఈ సినిమా ప్రారంభం సమయంలో అసలు ఎన్టీఆర్‌ మూడు పాత్రల్లో ఎలా కనిపించబోతున్నాడు, మూడు పాత్రలను ఎలా బ్యాలన్స్‌ చేస్తారు అంటూ అభిమానులు ఆలోచనల్లో ఉండేవారు. మెల్ల మెల్లగా ఒక్కో పాత్రను రివీల్‌ చేస్తూ చిత్ర యూనిట్‌ సభ్యులు టీజర్‌లు విడుదల చేస్తుంటే సినిమాపై అంచనాలు అమాంతం పెరుగుతూ ఉన్నాయి. జై పాత్ర విడుదల చేసిన సమయంలో ఒక పాత్రలో ఎన్టీఆర్‌ విలన్‌గా కనిపించబోతున్నట్లుగా నిర్ధారించుకున్నారు.

జై పాత్రలో ఎన్టీఆర్‌ దుర్మార్ఘులకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా కనిపించాడు. ఇక లవ కుమార్‌ మంచి వారు అంటే ఇలా ఉంటారేమో అన్నట్లుగా కనిపించాడు. ఇక కుశ ఎలా ఉంటాడో అని ఎదురు చూసిన ప్రేక్షకులకు ఫ్యాన్స్‌కు సమాధానం లభించింది. తాజాగా విడుదలైన కుశ టీజర్‌తో సినిమా క్లారిటీ వచ్చేసింది. సినిమాలో కీలక పాత్ర కుశది ఉంటుంది. ఆయన పాత్రతోనే సినిమా ఎంటర్‌టైన్‌మెంట్‌గా సాగుతుంది. మంచి వారికి మంచివాడు, చెడ్డ వారికి చెడ్డవాడుగా కుశ ఉంటాడని టీజర్‌ను చూస్తుంటే అర్థం అయ్యింది. మూడు పాత్రలపై ఒక క్లారిటీ రావడంతో సినిమా ఎప్పుడెప్పుడు చూస్తామా అని అంతా ఎదురు చూస్తున్నారు. ఈనెల 21న దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు జై లవకుశ రాబోతున్న విషయం తెల్సిందే.


మరిన్ని వార్తలు:

యుద్ధం శరణం… తెలుగు బులెట్ రివ్యూ

కుశ టీజర్‌ వచ్చేసింది …ఎన్టీఆర్ అదుర్స్

మేడ మీద అబ్బాయి… తెలుగు బులెట్ రివ్యూ