‘ఒక్కడు మిగిలాడు’ ప్రివ్యూ

Okkadu Migiladu Movie preview

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

నటీనటులు :   మనోజ్, జెన్నీఫర్, అనీష ఆంబ్రోస్, సుహాసిని 

నిర్మాత  :   లక్ష్మీ కాంత్ , ఎస్. ఎన్. రెడ్డి 
దర్శకత్వం : అజయ్ఆండ్రూస్ 

మ్యూజిక్ డైరెక్టర్ :   శివ నందిగామ 

మంచు మనోజ్‌ హీరోగా అజయ్‌ ఆండ్రూస్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఒక్కడు మిగిలాడు’. ఎల్‌టీటీఈ ప్రభాకరణ్‌ పాత్రను మంచు మనోజ్‌ పోషించాడు. శ్రీలంకకు చెందిన ప్రభాకరణ్‌ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఎల్‌టీటీఈ నేత పాత్రతో పాటు స్టూడెంట్‌ లీడర్‌ పాత్రను కూడా మంచు మనోజ్‌ పోషిస్తున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం చిత్రానికి సంబంధించిన ప్రమోషన్‌ కార్యక్రమాల్లో జోరుగా మనోజ్‌ పాల్గొంటున్నాడు. ఇది పక్కా రెగ్యులర్‌ సినిమాలా కాకుండా ఒక ప్రయోగాత్మక చిత్రంగా ఉంటుంది. పాటలు లేకుండా ఈ చిత్రం సాగిపోతుంది.

మంచు మనోజ్‌ ఈ చిత్రం గురించి మాట్లాడుతూ.. సినిమాలో హీరో పాత్ర కనిపించకుండా కథతో సాగిపోయే విధంగా రెండు పాత్రలు ఉంటాయి. ఆ రెండు పాత్రల్లో తాను కనిపిస్తాను అంటూ చెప్పుకొచ్చాడు. రెండు పాత్రల్లో కూడా అద్బుతమైన ఎమోషన్‌ సన్నివేశాలు ఉంటాయని, తప్పకుండా ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉంటుందని మనోజ్‌ ఆశాభావం వ్యక్తం చేశాడు. అయితే కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ లేకుండా తెరకెక్కిన ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆధరిస్తారా లేదా అనేది చూడాలి. కమర్షియల్‌ లేకున్నా కూడా పలు సినిమాలు మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. అదే నమ్మకంతో మనోజ్‌ మరియు అజయ్‌లు ఈ ప్రయత్నాన్ని చేశారు. మరి మనోజ్‌ ప్రయత్నం సక్సెస్‌ అయ్యేనా లేదో రేపు సినిమా విడుదల తర్వాత క్లారిటీ వచ్చేస్తుంది.