సింధుకు కఠిన పరీక్ష

సింధుకు కఠిన పరీక్ష

చైనా ఓపెన్‌ సూపర్‌ సిరీస్‌లో పీవీసింధు తన కన్నా తక్కువ ర్యాంకు షట్లర్‌ పాయ్‌ యు చేతిలో పరాజయం పాలైంది. తొలి రౌండ్లోనే ప్రపంచ ఆరో ర్యాంకర్ పీవీ సింధు 13-21, 21-18, 19-21 తేడాతో ఓటమి పాలైంది. 74 నిమిషాల పాటు జరిగిన పోరులో తొలిగేమ్‌లో ఓటమి పాలై రెండో గేమ్‌ గెలిచింది.

ప్రపంచ చాంపియన్‌ భారత స్టార్‌ బ్యాడ్మింటన్‌ ప్లేయర్‌ పీవీ సింధు ఈ ఏడాది లోటుగా ఉన్న ప్రపంచ బ్యాడ్మింటన్‌ సమాఖ్య-బీడబ్ల్యూఎఫ్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌ టైటిల్‌ను సాధించేందుకు బరిలోకి దిగనుంది. చైనా ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–750 టోర్నీ నేటి నుంచి ఆరంభం అవగా సింధుతో సహ భారత్‌కి చెందిన మరో మహిళా స్టార్‌ ప్లేయర్‌ సైనా నెహ్వాల్‌ మహిళల సింగిల్స్‌ లో ఆడనున్నారు.

సైనా నెహ్వాల్‌, పీవీ సింధు ఇద్దరికీ క్లిష్టమైన పరిస్థితే. చైనా ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–1000 టోర్నీతో పాటు కొరియా ఓపెన్, డెన్మార్క్‌ ఓపెన్, ఫ్రెంచ్‌ ఓపెన్‌ టోర్నీల్లో పీవీ సింధు పాల్గొనగా ఫ్రెంచ్‌ ఓపెన్‌లో క్వార్టర్‌ ఫైనల్‌వరకి చేరింది. మిగతా మూడు టోర్నీల్లో పీవీసింధు ప్రిక్వార్టర్‌ ఫైనల్‌ కూడా వెళ్లలేకపోయింది.