కరుణని పరామర్శించిన సీఎం…ప్రకటన !

palaniswami visit kauvery hospital

కావేరి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న డీఎంకే అధినేత ఎం.కరుణానిధి ఆరోగ్యం నిలకడగానే ఉందని తమిళనాడు సీఎం పళనిస్వామి అన్నారు. సోమవారం ఉదయం కరుణానిధి కుటుంబసభ్యులను కలిసి పరామర్శించిన ఆయన కరుణానిధి ఆరోగ్యంపై ఆరా తీశారు. అనంతరం ఆయన డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వంతో కలిసి ఆయన చెన్నైలోని కావేరి ఆసుపత్రికి వెళ్లారు. ఈ సందర్భంగా కరుణానిధిని పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు.

అనంతరం మీడియాతో మాట్లాడుతూ, కరుణానిధిని ఇప్పుడే కలిశానని… ఆయన ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని అన్నారు. మరోవైపు, కరుణ అనారోగ్యం నేపథ్యంలో చెన్నైలో భద్రతను కట్టుదిట్టం చేశారు. అయితే పోలీసులకు సెలవులను రద్దు చేశారు. నిన్న రాత్రి 8-30 గంటల సమయంలో కరుణ ఆరోగ్యం విషమించిందన్న వార్త బయటకు రావడంతో డీఎంకే కార్యకర్తలంతా ఆస్పత్రికి పరుగులు తీశారు. వేలాదిగా వారు తరలిరావడంతో కరుణ ఆరోగ్యంపై తమిళనాడు వ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ నెలకొంది.