‘పంతం’ మూవీ ప్రివ్యూ…

Pantham Movie Preview

గోపీచంద్‌ నటిస్తోన్న 25వ చిత్రం ‘పంతం’ రేపు విడుదల కానుంది. గ్లామర్ బ్యూటీ మెహరీన్ పిర్జాదా కథానాయికగా నటిస్తుండగా. ‘బలుపు’, ‘పవర్’, ‘జై లవ కుశ’ వంటి హిట్ చిత్రాలకు స్క్రీన్‌ప్లే అందించిన చక్రవర్తి (చక్రి) ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కె.కె.రాధామోహన్ నిర్మిస్తున్న ఈ సినిమా భారీ అంచనాలతో విడుదల కానుంది. ఒక్కమాటలో చెప్పాలంటే గోపీచంద్ ఈజ్ బ్యాక్ అనే విధంగా ‘పంతం’ ఉంది అని తెలుస్తోంది. విలన్ గా ఎంట్రీ ఇచ్చి విలన్ గా ఉన్నప్పుడే మాస్ ఆడియన్స్‌‌లో తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను సాధించిన గోపీచంద్ హిట్ కొట్టేందుకు ఈసారి పొలిటికల్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్‌ జానర్‌ను ఎంచుకున్నారు. పంతం టీజర్‌ ను చూస్తేనే ఈ విషయం సగం అర్ధం అయిపోతుంది లంచగొండి నాయకులకు ఓటేసి గెలిపించిన ప్రజలకు స్ట్రాంగ్‌గానే క్లాస్ పీకారు.

లౌక్యం తర్వాత మూడు నాలుగు సినిమాలు వచ్చినాసరయిన హిట్ లేక బాధపడుతున్న గోపీచంద్ ఈ సినిమా మీద ఆశలు పెట్టుకున్నాడు. అయితే సినిమా కూడా ఆశించిన మేర వచ్చిందని తెలుస్తోంది. ఇప్పరికే విడుదల అయిన రిలీజ్ డే, టీజర్లు, ట్రైలర్లు సినిమా మీద ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. ‘ఫ్రీగా ఇళ్లు ఇస్తాం.. కరెంటు ఇస్తాం.. రుణాలు మాఫీ చేస్తాం.. ఓటుకి ఐదువేలు ఇస్తాం అనగానే ముందు వెనుక, మంచి చెడు ఆలోచించకుండా ఓటేసేసి అవినీతి లేని సమాజం కావాలి.. కరప్షన్ లేని కంట్రీ కావాలంటే ఎక్కడ నుండి వస్తాయ్’ అంటూ గోపీచంద్ చెప్తున్న డైలాగ్ రోమాలు నిక్కబొడుచుకునేలా ఉంది. సినిమా మొత్తం మీద మన సిస్టం మీద ఇలాంటి అనేక పంచ్ డైలాగ్ లు ఉన్నట్టు తెలుస్తోంది. రచయిత రమేష్ రెడ్డి పదునైన మాటలు సినిమాకి చాలా ప్లస్ అని తెలుస్తోంది. గోపీసుందర్‌ సంగీతం, ప్రసాద్‌ మూరెళ్ల సినిమాటోగ్రఫీ సినిమాకు పెద్ద ఎసెట్‌ అని అనుకుంటున్నారు. ఇక రేపు ఉదయం ఈ సినిమా థియేటర్లలోకి రానుంది.