పరిటాల రవి బర్త్ డే స్పెషల్ స్టోరీ…

paritala ravindra life history

పరిటాల రవి

(ఆగష్టు 30, 1958 – జనవరి 24, 2005)

(పరిటాల రవీంద్ర) ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి మరియు అనంతపురం జిల్లా పెనుగొండ మాజీ శాసన సభ సభ్యుడు మరియు తెలుగుదేశం పార్టీలో ప్రముఖ నాయకుడు.

2005 లో ప్రత్యర్థుల దాడిలో మరణించాడు.

ఆయన భార్య పరిటాల సునితమ్మ ప్రస్తుతము రప్తాడు శాసనసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నది.

పరిటాల రవి శాసనసభ సభ్యుడు నియోజకవర్గం పెనుకొండ

వ్యక్తిగత వివరాలు

జననం 30 ఆగస్టు 1958
వెంకటాపురం,
నసనకోట పంచాయితి,
రామగిరి మండలం,
అనంతపురం జిల్లా,
ఆంధ్ర ప్రదేశ్

మరణం
24 జనవరి 2005 (aged 46)
అనంతపురంరాజకీయ పార్టీతెలుగు దేశంభాగస్వామి పరిటాల సునితమ్మకు సంతానం ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె నివాసం వెంకటాపురం. 1975లో భూస్వాములు, ఫ్యక్షనిస్ట్లు కుట్రపన్ని పరిటాల శ్రిరములుగారిని, *అయన తమ్ముడు పరిటాల సుబ్బయ్యని దారుణంగా హత్యచేసారు.

తండ్రి చనిపోయేనాటికి పరిటాల రవీంద్ర వయసు పదిహేను సంవత్సరాలు. ఎటు చుసిన నలువైపుల అలజడి అభద్రతా అంతులేని అరాచకం. ఎ క్షణన ఏ పెనుముప్పు ముంచుకోస్తుందో అంతుపట్టని ఉద్రిక్త వాతావరణం…

కన్నబిడ్డల కోసం గుండేను బండరాయిల చేసుకుని బతుకుతున్న తల్లి నారాయణమ్మకి అండగా నిలబడ్డాడు. తమ్ముడు పరిటాల హరితో పటు ఆహోరాత్రాలు శ్రమించి తండ్రి తాలుకు అప్పుల్ని తిర్చెశారు. తండ్రి అడుగుజాడల్లో నడిచిన తమ్ముడు హరి బూటకపు ఎన్ కౌంటర్ లో మరణించాడు.

పరిటాల హరి మరణం తో ప్రాంతమంతట మళ్ళి చిమ్మచీకట్లు కమ్ముకున్నయి. అరాచకం జడలు విప్పి నాట్యం చేసింది.

——:::::::::::::::::::———

భూస్వాములు, ఫ్యక్షనిస్ట్లు పరిటాల రవీంద్ర మీద దృష్టిని సారించారు. అతనని వెంటాడి వేధించటం ప్రారంభంచారు. కష్టకాలంలో విప్లవ శిబిరం పరిటాల రవీంద్ర ఆశ్రయం కల్పించింది పరిటాల శ్రీరాములు హత్య వెనుక కుట్ర జరిపిన ముఖ్యుడుని గుర్తిచిన పీపుల్స్ వార్ పార్టీ మద్దెలచెరువు గ్రామానికి చెందినా మాజి శాసన సభ్యుడు గంగుల నారాయణ రెడ్డిని 1983లో కాల్చి చంపింది.

ఈ హత్యకేసులో పరిటాల రవిని ప్రధాన ముద్దాయిగా చేర్చారు. అజ్ఞాత జీవితం గడుపుతనే మొదటినుంచి తన కుటుంబానికి బాసటగా వుంటూ వచ్చిన జనాన్ని సంఘటితం చేసుకుంటూ వచాడు పరిటాల రవీంద్ర

1983 లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి ఆంధ్ర రాష్ట్రంలో మొట్టమొదటిసరిగా కాంగ్రెస్ తెర ప్రభుత్వాని స్తఫించి తెలుగుదేశం పార్టీ చరిత్ర సృష్టించింది.

ఆంధ్రుల అభిమాన నటుడు ఎన్. టి. రామారావు ముఖ్యమంత్రి అయ్యరు.

రాష్ట్ర రాజకీయ వాతావరణంలో ఒక తాజాదనం వేల్లువిరిసింది.1984లో పరిటాల రవీంద్ర తన స్వగ్రామం చేరుకున్నాడు. 1984 అక్టోబర్ 27న దర్మవరుపు కొండన్నగారి  పెద్ద కుమార్తె సునితమ్మతో పరిటాల రవి పెళ్లి జరిగింది.

పరిటాల శ్రీరాములు హత్యకసులో ప్రధాన ముద్దాయి సిద్దప్ప శిక్ష ముగించుకుని జైలునుంచి బైటకి వచ్చాడు.1986లో పీపుల్స్వార్ ఆగ్రహానికి గురై దుర్మరణం చెందాడు. ఈ హత్యకేసులోను పరిటాల రవిని ముద్దాయిని చేశారు

మళ్ళి అజ్ఞాతం కర్ణాటక రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో జీవితం గడిపాడు. నక్సలైటు ఉద్యమ నిర్మాతల్లో ప్రముఖుడు కొండపల్లి శితరమయ్యతో సన్నిహిత సాంగత్యం ఏర్పడింది. కేసునుంచి బయిటపడి తిరిగి వెంకటాపురం చేరాడు.

తన తండ్రి తమ్ముడు సాగినిచిన భూస్వామ్య వ్యతిరేక పోరాటాన్ని ఏదో ఒక రూపంలో ముందుకు తీసుకువెళ్ళటమే సరైన మార్గమని భావించాడు. ఫాక్షనిజాన్ని నిర్ములించాటమే తన జీవిత లక్ష్యంగా పెట్టుకున్నాడు.అందుకు అవసరమైన సాధన సంపత్తులను సమకూర్చుకునే మార్గాల మీద దృష్టిని కేంద్రీకరించాడు.

ఆనతికలంలోనే పరిటాల రవికి దనదైన ఒక ప్రత్యక రక్షణ వ్యవస్థ ఏర్పడింది.ప్రజానాయకుడుగా పరిటాల రవీంద్ర తొలి అడుగులు వేయటం ప్రారంభించాడు

రాష్ట్రంలోనే తోలి మండల వ్యవస్థ ఎన్నికలు.

పరిటాల రవి మద్దతుతో రామగిరి మండల అధ్యక్షపదవికి రంగంలోకి దిగిన దళితుడు ఓబన్న అత్యాధిక మెజారిటీతో ఘన విజయం సాధించాడు.అదే సంవత్సరం  అసెంబ్లీ ఎన్నికలు పరిటాల శ్రీరాములు హత్య,పరిటాల హరి బుటాకపు ఎన్ కౌంటర్ ల వెనక కీలకమైన వ్యక్తి సానె చెన్నారెడ్డి పెనుగొండ నియోజకవర్గం కాంగ్రెస్ గా అభ్యర్ధిగా రంగంలోకి దిగాడు.

భారీ పోలీస్ బందోబస్తుతో ఎన్నకల ప్రచారానికి వస్తున్నా చెన్నారెడ్డిని రామగిరి మండలంలో అడుగు పెట్టకుండా ఆత్మాహుతి దళంతో అడ్డుకున్నాడు.పరిటాల రవీంద్ర ఈ సంఘటన అప్రాంతంలోని బడుగు వర్గాల ప్రజలకు బలాన్ని యిచ్చింది. ఏడు సంవస్తరాల దీర్ఘ విరామం తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మళ్ళి అధికారంలోకి వచ్చింది.

కనుముక్కల గ్రామానికి చెందినా సానె చెన్నారెడ్డి ఎమ్మెలే అయ్యాడు

ఎమ్మెలే చెన్నారెడ్డి కక్షకట్టాడు తనకు వ్యతిరకంగా పనిచేసిన వారి మీద ప్రదానంగా పరిటాల రవి మద్దతుదారుల మీద పెద్దయొత్తెన దాడులు ప్రరంభిచాడు . కుంటిమద్ది గడిగకుంట ఏడుగుర్రాలపల్లి వంటి అనేక గ్రామాల మీద మారణాయుధాలతో దాడులు జరిపించి బీభత్సం సృష్టంచాడు అనేక కుటుంబాలను గ్రామాలనుండి తరిమేశాడు

1991 మే నెల 7వ తేదీన పీపుల్స్ వార్ నక్సలైటులు శాసన సభ్యుడు చెన్నారెడ్డిని కాల్చి చంపారు.చెన్నారెడ్డి అనుచరులు పరిటాల రవీంద్ర స్వగ్రామానికి సమీపంలో వున్నా కొత్త గదిగాకుంట గ్రామం మీదికి మారణాయుధాలతో దాడి చేసి భీభత్సం సృష్టించాడు.వెంకటపురం నుంచి జనం వెళ్లి వాళ్ళను తరిమికొట్టే వరకు ఆరాచకం కొనసాగుతూనే వుంది.దాదాపుగా ఊరు ఊరుంత బుగ్గిపాలయింది.

పెనుగొండ అసెంబ్లీకి జరిగిన ఉప ఎన్నికలో చెన్నారెడ్డి పెద్దకొడుకు ఎస్. వి. రమణారెడ్డి శాసన సభ్యులు గా గెలిచాడు.

ఎమ్మేలే తమ్ముడు ఓబ్బుల్రెడ్డి మాజీ ఎమ్మేలే కుమారులు సూర్యనారాయణరెడ్డి (సూరి) రఘునాధరెడ్డి వాళ్ళ అనుచరులు సాగించిన ఆరచకాలతో పెనుగొండ ధర్మవరం ప్రాంతాలు అతలాకుతలం అయ్యాయి

హత్యలు, కిడ్నాప్ లు మానభంగాలు నిత్యక్రత్య లుగా మారిపొయి.

1991 నుంచి విశ్రుంఖల స్వైర విహారం చేస్తున్న ఆరాచక శక్తుల్ని రకరకాల పద్దతుల ద్వార ఎద్రుకోవటం వాళ్ళ పరిటాల రవి ప్రజల దృష్టిలో హీరో అయ్యాడు

తననీ తన అనుచరుల్ని నక్సలైట్లుగ చిత్రించి మట్టుపెట్టాలనే ప్రయత్నాలు జరుగుతున్నట్టు పరిటాల రవికి సమాచారం అందింది.

1992 లో జిల్లా ఎస్. పి. కెప్టెన్ కే. వి. రెడ్డి సమక్షంలో పోలిసుల ముందు లొంగిపోయాడు.

రాజకేయల్లోకి పరిటాల

సరెండర్ అయిన మరుసటి దినం నుంచే పరిటాల రవి క్రియాశీల రాజకేయల్లోకి ప్రవశిస్తున్నట్లు ప్రచారం ప్రారంభమయింది.

ధర్మవరం లో ఓబులరెడ్డి అరాచకాలను బహిరంగంగా ఎదురించిన మొదటి వ్యక్తి షాక్ ముష్కిన్ మాజీ తీవ్రవాది అయిన ముష్కిన్ పరిటాల రవికి సన్నిహితుడు.

1993 సెప్టెంబర్ 23న ఎస్వీ సోదరులు, సూరి సోదరులు ముష్కిన్ ని దారుణంగా చంపారు.

1993 జూన్ 7న రవి తెలుగుదేశం పార్టీలో చేరాడు.

ఒక్క అనంతపురం జిల్లా మాత్రమేగాక రాయలసీమకు చెందినా టి డి పి కార్యకర్తలు, సానుభూతిపరులు పరిటాల రవీంద్రకు బ్రహ్మరధం పట్టారు.

1993 అక్టోబర్ 24న మద్దలచెరువు గ్రామంలో టివీ బాంబు సంఘటన జరిగింది.

ఈ సంఘటనతో సూరి తమ్ముడు రఘునాధరెడ్డితో సహా ఆరుగురు చనిపోయారు.

ఈ సంఘటనకు ప్రధాన కారకుడు పరిటాల రవేనని కాంగ్రెస్ నాయకులూ విమర్శల వర్షం కురిపించారు.

1994 జూన్ 17న వై. యస్. రాజారెడ్డి వెంకటాపురం వెళ్ళి పరిటాల రవిని కలిశాడు.

రాజారెడ్డి – రవీంద్రల కలయిక కాంగ్రెస్ వర్గాల్లో కలవరం సృష్టించింది.

ఆగష్టు 7న హైదరాబాద్ సమీపంలోని షాద్నగర్ లో జంట హత్యలు జరిగాయి.

హతులిద్దరూ పెనుగొండ శాశానసభ్యుడు ఎస్. వి. రమణారెడ్డి అనుచరులు.

ఈ కేసులో ప్రధాన ముద్దాయి పరిటాల రవి. వేరే కేసులో పెండింగ్ లో వున్నా వారంట్ కింద రవి కోర్ట్ అనుమతితో ప్రభుత్వ ఆసుపత్రిలో చేరాడు.

పరిటాల రవి అనుచరులకీ ఎస్వి సోదరులుకీ మధ్య ప్రత్యక్ష పోరాటం ప్రారంభమైంది.

జైలునించే పరిటాల రవి నామినేషాన్ దాఖలు చశారు.

అన్ని అవాంతరాలను అధిగమించి అత్యధిక మజోరిటితో పరిటాల రవీంద్ర విజయం సాధించాడు.

ఎన్టీఆర్ మంత్రి వర్గంలో పరిటాల రవీంద్ర కార్మికశాఖ మంత్రి అయ్యాడు.

ఆ తర్వాత కాలంలో అనంతపురం జిల్లా చరిత్ర పరిటాల రవీంద్ర అడుగు జాడల్ని అనుసరించింది

అధికార బలంతో శత్రుసంహారం సాగిస్తాడని వేసుకున్న ప్రత్యర్దుల అంచనాలను పరిటాల రవీంద్ర చిత్తూ చేశాడు.

వివిధ గ్రామాల్లో ఫ్యాక్షన్ గ్రూపుల మద్య రాజికుదిర్చాడు.

ఫ్యాక్షన్ బాదిత కుటుంబాలకు పునరావాసం కల్పించాడు.

మొత్తంగా జిల్లా అభివృద్ధి మీద దృష్టిని కేంద్రీకరించాడు కేంద్రీకరించాడు.

ఎన్టీఆర్ ప్రభుత్వం సంక్షోబంలో పడింది.

నారాచంద్రబాబు నాయుడు ముక్ష్యమంత్రి పదివిని చపట్టారు

ఎనిమిది మాసాలపాటు కాబినెట్ మంత్రిన పనిచేసిన పరిటాల ఎన్టీఆర్ మరణాంతరం శాసన సభా పదవికి రాజీనామా చేశాడు.

ఉప ఎన్నికలులో గెలిచి చంద్రబాబు నాయకత్వంలోని అధికార తెలుగుదేశం పార్టీలో చేరాడు.

1996 లో ఓబుల్ రెడ్డి హత్య జరిగింది.

1997 లో తన తండ్రి జీవితకధ ఆధారంగా
స్నేహలత పిక్చర్స్ పతాకం కింద “శ్రీరాములయ్య” చలనచిత్ర నిర్మాణం చేపట్టాడు.

నవంబర్ 19న సినిమా ముహూర్తం సందర్భంగా జరిగిన కారుబాంబు పలుడుతో తీవ్రంగా గాయపడిన పరిటాల రవి ప్రాణాలతో బయటపడ్డాడు.

ఈ ద్రుఘటనలో 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు.

పరిటాల రవిని హతమార్చేందుకు మద్దలచేరవు సూరి అతని అనుచరులు ఈ ఘాతుకానికి పాల్పడినట్టు విచారణలో వెల్లడయింది.

సూరితో సహా కారుబాంబు నిన్దితుందరినీ పోలీసులు గావించి పట్టుకున్నాడు.

న్యాస్థానం దాదాపుగా అందరికీ యావజ్జీవ శిక్ష విధించింది.

2001లో రవి తీవ్ర అస్వస్థకి గురియ్యడు

2003లో నసనకోట వద్ద శిదిలవస్తాలోవున్న రాయల కాలంనాటి దేవాలయాన్ని ఎంతో శ్రమకోర్చి పునరుద్ధరించాడు.

దేవాలయ ప్రాగణంలో దాదాపు రెండున్నర లక్షలమంది జనం సమక్షంలో 550 జంటలకు సమూహిక వివాహాలు జరిపించాడు.

2004 ఫెబ్రవరిలో 1116 జంటలకు పెళ్ళిళ్ళు చేశాడు.

2004 అసెంబ్లీ ఎన్నికలో కారుబాంబు నిందితుడు సూరి భార్య కాంగ్రెస్ పార్టీ పరిటాల రవి మీద పోటికి నిలబెట్టేంది.

తెలుగుదేశం పార్టీ ఘోరపరాజయం పాలై అధికారం కోల్పోయింది.

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది.

అనంతపురం జిల్లాలో పరిటాల రవి అనుచరులు ఏరివేత మొదలయింది. రవికి కుడి భుజంగ వున్నా చమన్, సురేష్ అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. పరిటాల రవి మీద పాతకేసులను తిరగదోడటం ప్రారంభమయింది.

తన ప్రాణానికి ముప్పు ఏర్పడిందినీ, సరైన రక్షణ కల్పించమని పదే పదే ప్రభుత్వాన్ని అభ్యర్ధించాడు ఫలితం రవికి రక్షణగా వుండే గన్ మెన్ ల సంఖ్యని రెండుకి తగ్గిచారు.

గన్ మెన్ ఇద్దరు ముసలి వాళ్ళను ఇచ్చారు వైస్ ప్రభుత్వం. తనను చంపేందుకు జరుగుతున్నా కుట్రలను గురించిన వివరాలను ఎప్పటికప్పుడు బహిర్గతం చేస్తూ వచ్చాడు.

చెర్లపల్లి జైల్లో అనుభవిస్తున్న కారుబాంబు నిందితుడు మద్దల చేరవు సూరికి ముఖ్యమంత్రి కుమారడు వై ఎస్. జగన మోహన్ రెడ్డికి మధ్య తనను హత్య చేసేందుకు సేలఫోన్ లో సంభాషణలు కొనసాగుతున్నట్టు రవి ఆరోపించాడు.

జగన్ మోహన్ రెడ్డి పరిటాల రవి మీద పరువు నష్టం దావా వేశాడు.

2004 డిసెంబర్ 23న పరిటాల రవి పులివెందుల కోర్టుముందు హాజరయ్యడు.

ఆరోపణలను రుజువుపరిచే సాక్ష్యదారాలు దన వుద్దవున్నాయని విలేఖరుల సమవశంలో వెల్లడించాడు.

పరిటాల రవి యిళ్ళలో సోదాలు మొదలయ్యాయి. అనంతపురంలోని ఇంట్లో వెంకతపురంలోని ఇంట్లో పోలీసులు అణువుణవు గాలించారు. తెలుగుదేశం అనుచరులు, మద్దతుదారులు మీద దాడులు, హత్యల పరంపర కొనసాగుతూనే వుంది.

2004 సెప్టెంబర్ 7న రవి అనుచరుడు తగరకుంట ప్రభాకర్ హత్య జరిగింది.

అక్టోబర్ 9న బళ్లారిలో వుంటున్న రవి బంధువు రాజకీయ గురువు అయిన అర్. కె. అలియాస్ (మలపాటి వెంకటేశ్వరరావు) హత్య జరిగింది.

పరిటాల రవి ప్రాణాలకు ఏ క్షణంలొనయిన ముప్పువాటిల్లే పరిస్థితి దాపురించింది. మానసికంగా అన్నింటికీ సంసిద్ధం అయ్యాడు. ఎవరెన్ని విధాలుగా చెప్పిన తనను నమ్ముకునివున్న ప్రజలను ఎటువంటి పరిస్తితుల్లోను తన ఒక్కడి ప్రాణాలు కాపాడుకోవటంకోసం వదిలిపెట్టి వెళ్ళే ప్రసక్తే లేదని చెప్పాడు.

దారుణంగా హత్య

2005 జనవరి 24వ తేదీ. అనంతపురం తెలుగుదేశం పార్టీ కార్యాలయం.

అనేకమంది అతిరధ మహరధులు వంటి పార్టీ రాష్ట్రనాయకులు అక్కడే వున్నారు.

సాయూధలైన అనేకమంది అన్గారక్షకులున్నారు.

మధ్యన్నభోజనం ముగించుకుని యింటికీ బయలుదేరుదామని పార్టీ కార్యాలయం ఆవరణలోకి అడుగుపెట్టిన ప్రజల మనిషి పరిటాల రవీంద్ర మీద బులెట్ ల వర్షం కురుసింది.

శత్రువులు పకడ్బందిగా పన్నిన పద్మవ్యూహంలో పొరపాటున పడిన అతని అడుగు నెత్తుటి మడుగాయంది.

పిడుగుపాటు వంటి ఈ వార్తకి ఆంధ్రరాష్ట్రం భగ్గుమంది.

వరాల తరబడి అనేక నగరాల్లో నిరవదికంగా కర్ఫ్యూ కొనసాగింది

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయాలు చేస్తున్నారూ పరిటాల రవీంద్ర గారి అభిమానులు పై తప్పుడు కేసులు నమోదయ్యాయి

బెల్లంకొండ సురేష్

మరిన్ని వార్తలు:

అమృత అమ్మకే పుట్టిందట.

అతి చేస్తున్న పవన్

తెలంగాణలో ప్రీ పెయిడ్ కరెంట్