ఏరా బడికి పోలేదా…ఇక్కడే ఉంటె తంతా !

Minister Paritala sunitha scolds a boy working in anna canteen
Minister Paritala sunitha scolds a boy working in anna canteen

ఇప్పుడున్న ఏపీ మంత్ర్రులలో మాజీ మంత్రి పరిటాల రవి సతీమణి రాప్తాడు ఎమ్మెల్యే, రాష్ట్ర పౌరసరఫరాల శాఖా మంత్రి సునీతది ప్రత్యేక శైలి. ఆమెకి తాను మంత్రినన్న దర్పం గానీ అధికారంతో వచ్చే పొగరు ఉండవు, ఈ విషయం ఆమె వెన్నంటే ఉండేవారికి అంతెందుకు ఆమెని ఒక్కసారి కలసినా ఆ విషయం అర్ధమవుతుంది. తాజాగా అలాంటిదే ఒక సంఘటన చోటు చేసుకుంది. వివరాలలోకి వెళితే అనంతపురంలోని బైపాస్ రోడ్డులో ఇటీవల ఏర్పాటు చేసిన ‘అన్న క్యాంటీన్’ను తనిఖీ చేసేందుకు ఏపీ మంత్రి పరిటాల సునీత వెళ్లారు.

క్యాంటీన్ లో ఆహార పదార్థాల తయారీ, నాణ్యత, ముడి సరుకులను ఆమె పరిశీలించారు. ఆహారం ఎలా ఉందని, అక్కడికి వచ్చిన వారిని అడిగారు. అదే క్యాంటీన్ లో తినడానికి వచ్చిన వారికి ప్లేట్లు అందిస్తున్న ఓ బాలుడు ఆమె కంట పడటంతో, సునీత అతన్ని పలకరించారు. ఆపై “ఏరా… బడికిపోలేదా? ఇక్కడే ఉంటే తంతా” అంటూ ఆప్యాయంగా వార్నింగ్ ఇచ్చారు. చిన్న పిల్లలను పనిలో పెట్టుకోవద్దని క్యాంటీన్ నిర్వాహకులను హెచ్చరించారు. ఆ తరువాత ఐదు రూపాయలు ఇచ్చి టోకెన్ తీసుకుని, అందరితోపాటు భోజనం చేశారు. అక్కడికి వచ్చిన వారికి కాసేపు అన్నం వడ్డించారు.