పెళ్లైన ఆంటీతో పాస్టర్ రాసలీలలలు… ఆ ఒత్తిడి తట్టుకోలేకే అలా

ప్రస్తుతం సమాజాన్ని కరోనా వైరస్ అతలాకుతలం చేస్తుంది. ఇలాంటి సమయంలోనే పలు దారుణమైన కేసులు వెలుగు చూస్తున్నాయి. అదేమంటే.. ఓ మహిళకు మత్తు మందు ఇచ్చి నగ్నంగా ఫొటోలు తీశాడు ఓ పాస్టర్. అంతేకాకుడా ఆ ఫోటోలను చూపి బెదిరించి పలుమార్లు లైంగికదాడిన చేసిన ఘటన కృష్ణా జిల్లాలోని మచిలీపట్నంలో వెలుగు చూసింది. తాజాగా బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన ఇనగుదురుపేట పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.
అసలు ఏం జరిగింది అంటే… మచిలీపట్నం చిలకలపూడికి చెందిన రాచర్ల జోయెల్‌ రాజుపేటలోని ఇమ్మానియేల్‌ గాస్పెల్‌ చర్చిలో పాస్టర్‌గా పనిచేస్తున్నాడు. అదే  రాజుపేటకు చెందిన ఓ పెళ్లైన ఆమెతో ప్రార్థనల పేరిట పరిచయాలన సంబంధాన్ని  పెంచుకున్నాడు. 2019 అక్టోబరులో ఆమెకు కూల్‌డ్రింక్‌లో మత్తు మందు వేసి సెల్‌ఫోన్‌లో అసభ్యకరంగా ఫొటోలు తీశాడు. ఆ ఫొటోలను ఎరగా చూపి కోరిక తీర్చాలని.. లేదంటే సోషల్‌ మీడియాలో పెట్టేసి పరువు తీస్తానని బెదిరించాడు. దాంతో చేసేది లేక లొంగిపోయిన ఆమెను పలుమార్లు లైంగికదాడి చేశాడు.
కాగా ఈ మధ్య అతని వేధింపులు మరీ ఎక్కువ కావడంతో మానసికంగా నలిగిపోయిన ఆమెను చూసిన భర్తకు  అనుమానం వచ్చి నిలదీయడంతో విషయం బయటపడింది. దీనిపై ఇనగుదురుపేట పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు ఆ పాస్టర్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.