‘మట్టి ముంతలో మజ్జిగన్నం’ లో పవన్ కళ్యాణ్

‘మట్టి ముంతలో మజ్జిగన్నం’ లో పవన్ కళ్యాణ్

తెలుగు చిత్రసీమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును దక్కించుకొని, ఆ తరువాత ప్రజాసేవ మీద ఉన్నటువంటి ఆసక్తితో రాజకీయాల్లోకి వచ్చి, ఒక రాజకీయ పార్టీని స్థాపించి ప్రస్తుతానికి ప్రజలతో మమేకం అవుతున్నటువంటి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మళ్ళీ సినిమాలు చేస్తున్నాడని గత కొద్దిరోజులుగా వార్తలు వస్తున్నాయి. కానీ ఇప్పటివరకైతే ఈ విషయంలో ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదని చెప్పాలి. కానీ పవన్ కళ్యాణ్ తో ప్రముఖ సంచలనాల దర్శకుడు రాంగోపాల్ వర్మ ఒక సినిమా చేస్తున్నాడని వార్తలు చాలా వరకు వస్తున్నాయి.

కాగా ఆర్జీవీ తాజాగా తెరకెక్కించిన చిత్రం కమ్మరాజ్యంలో కడప రెడ్లు అయితే ఈ సినిమా ప్రమోషన్ కి సంబంధించి ఒక ప్రైవేట్ మీడియా ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరైనటువంటి ఆర్జీవీ కి మీడియా ప్రతినిధులు కొన్ని ప్రశ్నలు సంధించారు. అయితే వర్మ కొత్తగా ‘మట్టి ముంతలో మజ్జిగన్నం’ అనే టైటిల్‌తో పవన్ కళ్యాణ్ తో సినిమా చేస్తున్నారని వార్తలు వస్తున్నాయని, దానికి సంబందించిన వివరాలు అడగగా, ఆర్జీవీ స్పందిస్తూ అసలు ఆ విషయమే తనకు తెలియదని, ఒకవేళ ఆ సినిమా చేస్తే తప్పకుండ మీడియా కి అంకితం ఇస్తానని చెప్పారు.