ఇప్పటి నుంచే పడిగాపులు కాస్తున్న పవన్ అభిమానులు

ఇప్పటి నుంచే పడిగాపులు కాస్తున్న పవన్ అభిమానులు

ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా మొత్తం మూడు సినిమాలు వరుసగా చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.అయితే వీటన్నిటిలో మాత్రం దర్శకుడు హరీష్ శంకర్ తో సినిమా అనగానే ఒక్కసారిగా చెప్పలేని స్థాయి యుఫొరియా మొదలయ్యింది అని చెప్పాలి.ఈ ప్రాజెక్ట్ ను ప్రకటించగానే మిగతా రెండు సినిమాలపై లేని అంచనాలు అన్నీ ఒకేసారి దీనిపై వచ్చేసాయి.దీనితో ఈ సినిమా ఎలా ఉండబోతుందా అని పవన్ అభిమానులు ఇప్పటి నుంచే పడిగాపులు కాస్తున్నారు.

అయితే ఈ చిత్రంపై పుకార్లు మొదలయ్యిపోయాయి.అప్పుడు పవన్ మరియు హరీష్ ల మధ్య తెరకెక్కించిన “గబ్బర్ సింగ్” లా ఈ చిత్రాన్ని కూడ ఒక సినిమాకు రీమేక్ లా ప్లాన్ చేసి సేఫ్ గేమ్ ఆడుతున్నారని వార్తలు ప్రచారం చేస్తుండగా వాటన్నిటినీ హరీష్ ఖండించారు.తమ కాంబోలో వస్తున్న చిత్రం ఏ ఇతర సినిమాకు రీమేక్ కాదని డైరెక్ట్ గానే తెరకెక్కిస్తున్నామని ఒక క్లారిటీ ఇచ్చారు.ఇప్పటికే పవన్ పై రీమేక్ సినిమాలు చేస్తున్నారన్న మరక ఉంది.ఇలాంటి సమయంలో ఇలాంటి సినిమా ఒకటి చెయ్యడం అభిమానులకు కాస్త ఊరటనిచ్చే విషయమే అని చెప్పాలి.