కోర్టులో పిటిషన్ వేసిన నిర్మాత దిల్ రాజు

కోర్టులో పిటిషన్ వేసిన నిర్మాత దిల్ రాజు

ప్రస్తుతానికి రాష్ట్ర రాజకీయాలతో చాలా బిజీగా గడుపుతున్నటువంటి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, కొన్ని రోజుల విశ్రాంతి తరువాత మళ్ళీ మొహానికి రంగేసుకొని కొత్త సినిమా చేస్తున్నాడు. హిందీ లో భారీ విజయాన్ని నమోదు చేసుకున్నటువంటి పింక్ చిత్రాన్ని తెలుగులో పవన్ కళ్యాణ్ హీరో గా తెరకెక్కిస్తున్నారు. కాగా ఈ సినిమా పవన్ తో చేయాలని అనుకున్నప్పటి నుండే ఎన్నో రకమైన వివాదాలు కూడా వెంటాడుతున్నాయి. ఎందుకంటే ఈ చిత్రానికి సంబందించిన ఫోటోలు అన్ని కూడా ఎప్పటికప్పుడు బయటపడుతూనే ఉన్నాయి.

ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కూడా లీకులు జరుగుతుండటంతో పవన్ కూడా దిల్ రాజు పై సీరియస్ అయ్యారని తెలుస్తుంది.కాగా ఇదే విషయంలో నిర్మాత దిల్ రాజు కోర్టులో పిటిషన్ వేసాడు. తన సినిమా కోసం ఇలా ఎవరు కూడా అక్రమంగా ఫోటోలు, వీడియోలు బయటపెడట్టకూడదని ఆగ్రహాం వ్యక్తం చేస్తూ కోర్టును ఆశ్రయించారు. ఒకవేళ ఎవరైనా ఇలా అతిక్రమిస్తే, వారికి ఏడాది జైలులో పాటు 5 వేల రూపాయల జరిమానా కూడా విధిస్తున్నామని వెల్లడించారు. ఇకపోతే ఈ చిత్రానికి సంబందించిన టైటిల్, తదితర వివరాలన్నీ కూడా మే 15 న అధికారికంగా వెల్లడిస్తామని దిల్ రాజు అధికారికంగా ప్రకటించారు.