మరోసారి లాజిక్ మిస్ అయిన పవన్ !

Pawan Kalyan Porata Yatra Breaks again Because Of Security Reason

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

జనసేన పోరాట యాత్ర పేరుతో పవన్ కల్యాణ్ ఈనెల 20నుండి శ్రీకాకుళం నుంచి ప్రారంభించిన విషయం తెలిసిందే. భద్రతా కారణాల దృష్ట్యా పవన్ కల్యాణ్ తన పర్యటనకు గురువారం విరామం ప్రకటించారు. అయితే శుక్రవారం కూడా పర్యటన రద్దు చేసుకున్నారు. ‘పవన్‌ కల్యాణ్‌ వ్యక్తిగత భద్రతా సిబ్బంది గాయాల నుంచి పూర్తిగా కోలుకోనందున శుక్రవారం కూడా ఆయన కార్యక్రమాలు రద్దయ్యాయి. శనివారం నుంచి పోరాట యాత్ర కొనసాగుతుంది’ అని పార్టీ ఆ ప్రకటించారు. అయితే ఇప్పుడు ఇదే ప్రకటన పవన్ ని ఆబాసు పాలు అయ్యేలా చేస్తుంది. ఎందుకంటే ముందు నుండీ పవన్ కళ్యాన్ కి మాట నిలకడ ఉండదు అనే అపవాదు ఉంది ఇప్పుడు దానినే నిజం చేసేలా పవన్ కళ్యాణ్ ఈ ప్రకటన ఉంది. అలా ఎందుకు అంటే ఇప్పటివరకు జరిపిన పర్యటన మొత్తం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఆయనకు కనీస పోలీస్‌ భద్రత కూడా ఏర్పాటు చేయకపోవడంతో సొంత భద్రతా సిబ్బందితోనే జనసేనాని పర్యటన కొనసాగిస్తున్నట్లు దీంతో పవన్ పర్యటన సందర్భంగా ఆయన భద్రతా బృందంలోని 11 మంది భద్రతా సిబ్బంది గాయపడ్డారని, వారిలో కొందరికి తీవ్ర గాయాలు కూడా అయినట్లు జనసేన పార్టీ శ్రేణులు వెల్లడించాయి.

మరోసారి లాజిక్ మిస్ అయిన పవన్ ! - Telugu Bullet

వారు కోలుకోవడానికి గాను సమయం పట్టే పరిస్థితి ఉన్నందున పవన్‌ కళ్యాణ్ వారిని తమ తమ స్వస్ధలాలకు పంపుతున్నట్లు ఆ పార్టీ ప్రకటన విడుదల చేసింది. ఇలా వెళ్లిన భద్రతా బృందం సభ్యుల స్ధానంలో కొత్త వారు శ్రీకాకుళం చేరుకోవాల్సి ఉంది. అందువల్ల అనివార్య పరిస్ధితుల్లో గురువారం యాత్రకు విరామం ప్రకటించినట్లు పవన్ తన ప్రకటనలో వివరించారు. అయితే ఈరోజు చేసిన ప్రకటన మాత్రం దానికి పూర్తి విరుద్దంగా ‘పవన్‌ కల్యాణ్‌ వ్యక్తిగత భద్రతా సిబ్బంది గాయాల నుంచి పూర్తిగా కోలుకోనందున శుక్రవారం కూడా ఆయన కార్యక్రమాలు రద్దయ్యాయి. శనివారం నుంచి పోరాట యాత్ర కొనసాగుతుంది’ అని ప్రకటించింది. అయితే ఒకసారి వారిని స్వస్తలాలకి పంపామని చెప్పి ఇప్పుడు దెబ్బలు తగ్గలేదని చెప్పడం పీకేకే చెల్లింది అంటూ నెటిజన్లు విమర్సిస్తునారు.

మరోసారి లాజిక్ మిస్ అయిన పవన్ ! - Telugu Bullet