ఆసక్తికరమైన విషయాలను వెల్లడించిన పవన్ కళ్యాణ్

ఆసక్తికరమైన విషయాలను వెల్లడించిన పవన్ కళ్యాణ్

దేశవ్యాప్తంగా మహమ్మారి కరోనా వైరస్ విలయతాండవం చేస్తున్న తఱుణంలో మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ విధించిన సంగతి మనకు తెలిసిందే. కాగా ఈ లాక్ డౌన్ కారణంగా దాదాపుగా అందరు కూడా ఇళ్లకే పరిమితమయ్యారు. కాగా ఇలా ఖాళీగా దొరికిన సమయాన్ని వృధా చేయకుండా జాగ్రత్తగా వినియోగించుకోవాలని, అందరు కూడా వీలైనన్ని పుస్తకాలను చదవాలని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వెల్లడించారు. కాగా నేడు పుస్తక దినోత్సవాన్ని పురస్కరించుకొని, జనసేనాని పవన్ కళ్యాణ్ తన అధికారిక ట్విట్టర్ వేదిక ద్వారా పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడిస్తూ, వరుస పోస్టులు పెట్టారు…

కాగా “మానవ జీవితంతో మమేకమైపోయిన పుస్తకం పండుగ నేడు. ఏటా ఏప్రిల్ 23న ప్రపంచవ్యాప్తంగా బుక్ డే ను పాఠకులు ఆచరిస్తున్న సంగతి తెలిసిందే. పుస్తక ప్రియుడిగా నా భావాలను నాలుగు అక్షరాల రూపంలో మీతో పంచుకోవాలని ఈ ప్రకటన చేస్తున్నాను” అని పవన్ కళ్యాణ్ చెప్పారు.అంతేకాకుండా “డబ్బుతో కొనలేని అలౌకిక అందాన్ని అందించేది పుస్తకం.. చేతిలో చిల్లి గవ్వలేకపోయినా విజ్ఞాన సంపన్నునిగా మార్చేది పుస్తకం… దోచుకోడానికి అవకాశంలేని సంపదను ఇచ్చేది పుస్తకం. మనలోని అజ్ఞానాన్ని పారదోలేది పుస్తకం… మన మస్తకాన్ని తాజాగా ఉంచేది పుస్తకం” అని పవన్ కల్యాణ్ ట్వీట్ చేశారు.

“ఇంతటి మహత్తరమైన శక్తి కలిగిన పుస్తకాన్ని మన దిన చర్యలో భాగం చేద్దాం. ప్రస్తుత స్వీయ నిర్బంధన కాలంలో పుస్తక పఠనం తప్పనిసరిగా చేయండి. మానసిక దృఢత్వాన్ని పెంచుకోండి. పుస్తకాన్ని ప్రేమించండి.. విజ్ఞాన ప్రపంచంలో జీవించండి” అని పవన్ పిలుపునిచ్చారు. కాగా తన పుస్తకాలకు సంబందించిన పలు ఫోటోలను తన అధికారిక ట్విట్టర్ వేదిక ద్వారా పంచుకున్నారు పవన్ కళ్యాణ్…