బాణీ మార్చిన పవన్.

Pawan-Targeting-On-MP-Harib

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

2014 ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ కూటమి తరపున ప్రచారం చేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆ సభల్లోనే మీకు ఏ సమస్య వచ్చినా మీ తరపున ప్రశ్నిస్తా అని జనానికి హామీ ఇచ్చారు. అయితే ఆ హామీకి తగినట్టు పవన్ ప్రభుత్వ వైఫల్యాలను నిలదీయడం లేదని విమర్శలు వస్తూనే వున్నాయి. అయితే కేవలం రాజకీయ విమర్శలు చేయడం మాత్రమే తన పని కాదన్నట్టు వ్యవహరించిన పవన్ ఆ విమర్శలను పెద్దగా పట్టించుకున్నట్టు అనిపించదు. అయితే నేడు విశాఖ పర్యటనలో మాత్రం పవన్ బాణీ మారినట్టు స్పష్టంగా కనిపించింది.

pawan-kalyan

విశాఖ పర్యటనలో 2014 ఎన్నికల ప్రచారంలో తాను ఇచ్చిన హామీని పవన్ స్వయంగా ప్రజలకు గుర్తు చేశారు. అందుకు తగ్గట్టు డ్రెడ్గింగ్ కార్పొరేషన్ అఫ్ ఇండియా ప్రైవేటీకరణ, విశాఖకు రైల్వే జోన్ అంశాలను పవన్ ప్రస్తావించారు. ఈ విషయాల్లో విఫలం అయ్యారంటూ విశాఖ ఎంపీ హరిబాబు, అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్ ను పవన్ టార్గెట్ చేశారు. వాళ్ళు ఇద్దరూ ప్రజాప్రతినిధులుగా చేయాల్సింది చేయకపోవడం వల్ల మౌనం వీడి ప్రశ్నించడానికి వచ్చినట్టు పవన్ చెప్పారు. మొత్తానికి టీడీపీ , బీజేపీ లకు చెందిన ఇద్దరూ ఎంపీలను టార్గెట్ చేయడం ద్వారా జనసేన 2019 నాటికి ఏ వైఖరి తీసుకుంటుంది అన్నదానిపై పవన్ ప్రాధమిక సంకేతాలు ఇచ్చినట్టు అయ్యింది.