బాలీవుడ్ బాద్షా ని ట్రోల్ చేస్తున్న ప్రజలు

బాలీవుడ్ బాద్షా ని ట్రోల్ చేస్తున్న ప్రజలు

కరోనా మహమ్మారిపై ప్రభుత్వాలు చేస్తున్న యుద్దానికి మద్దతుగా ప్రముఖ సినీ తారలు పలువురు విరాళాలను ప్రకటిస్తున్న విషయం తెల్సిందే. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ పాతిక కోట్లు విరాళంగా ప్రధాన మంత్రి సహాయ నిధికి అందించాడు. ఆయనపై ప్రశంసలు కురిపిస్తున్న కొందరు ఇతర హీరోలపై విమర్శలు చేస్తున్నారు. ప్రముఖ హీరోలం.. స్టార్స్.. సూపర్ స్టార్ అంటూ కీర్తించబడుతున్న పలువురు హీరోలు ఇప్పటి వరకు కరోనా విపత్తు నేపథ్యంలో విరాళం ఇచ్చేందుకు ముందుకు రాలేదు.

ముఖ్యంగా బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ పై ట్రోల్స్ పెద్ద ఎత్తున వస్తున్నాయి. హీరోగా.. వ్యాపారవేత్తగా.. నిర్మాతగా ఎన్నో రకాలుగా వందల వేల కోట్ల సంపాదన దక్కించుకున్న షారుఖ్ ఖాన్ ఇప్పుడు కరోనా విపత్తుకు తన సాయం అందించడం లేదు ఎందుకు అంటూ ప్రశ్నిస్తున్నారు. ఐపీఎల్ కోల్ కత్తా నైట్ రైడర్స్ జట్టు యజమానిగా భారీగా లాభాలను ఆయన దక్కించుకున్నాడు. అయినా కూడా ఈ విపత్కర పరిస్థితుల్లో తన దాతృత్వంను చాటుకునేందుకు ఆయన మనసు అంగీకరించడం లేదా అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు.