పవన్ కి దండం పెడుతున్న కాపునాడు…

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
ఏ సామాజిక వర్గం అండ చూసుకుని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రస్థానం మొదలు పెట్టాడో అదే కాపు కులస్తులు ఇప్పుడు ఆయన మీద మండిపడుతున్నారు. ముద్రగడ కాపు ఉద్యమం కొనసాగించే సమయంలో కూడా చంద్రబాబు మీద నిప్పులు చెరిగిన కాపునాడు అధ్యక్షుడు పిళ్ళా వెంకటేశ్వరరావు తాజా పరిణామాల మీద స్పందించారు.

బీజేపీ కి వంత పాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా మాట్లాడ్డం వల్ల కాపులకి చెడ్డ పేరు వస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తూ పిళ్ళా నేరుగా పవన్ కళ్యాణ్ కి లేఖ రాశారు. చిరంజీవి పెట్టిన ప్రజారాజ్యం వల్ల కాపులు చాలా సమస్యలు ఎదుర్కొన్నారని, ఇప్పుడు పవన్ కళ్యాణ్ రాష్ట్రం కోసం పోరాడుతున్న చంద్రబాబు ని టార్గెట్ చేస్తూ రాజకీయం చేస్తుంటే ప్రజలు ఆగ్రహిస్తున్నారని పిళ్ళా అభిప్రాయపడ్డారు. కాపు లకి చెడ్డ పేరు తెచ్చే పనులు మానుకోవాలని పవన్ కి నమస్కారం పెట్టి మరీ పిళ్ళా వేడుకున్నారు. పిళ్లా రాసిన ఆ లేఖ పూర్తి పాఠం మీ కోసం.

 AP State Kapu Nadu