అంతమందిలో డ్రగ్స్ కి బలైంది ఒకే ఒక్కడు.

Police Found One Celebrity in Hyderabad Drugs Case

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

టాలీవుడ్ ని కొన్నాళ్ల కిందట డ్రగ్స్ కేస్ షేక్ చేసింది. సెలెబ్రెటీలు అనుకున్న చాలా మంది వాలిపోయిన మొహాలతో సిట్ ముందుకు వెళ్ళినప్పుడు ఈ కేసుతో మొత్తంగా టాలీవుడ్ లో ఇక డ్రగ్స్ ఊసు వినిపించదు అనుకున్నారు. కానీ కాలంతో పాటు ఆ అభిప్రాయాలు కూడా మారిపోయాయి. ఎక్కడ ఏమైందో కానీ డ్రగ్స్ కేసు వేడి తగ్గింది. అయితే అది పూర్తిగా పక్కకిపోయినట్టు కాదని ఇప్పుడు తెలుస్తోంది.

డ్రగ్స్ కేసు విచారణ సమయంలో సెలెబ్రెటీల నుంచి బ్లడ్ శాంపిల్ తీసుకోడానికి పోలీసులు ట్రై చేశారు. రక్తంలో మాదక ద్రవ్యాల ఆనవాళ్లు ఉంటే వారిని బుక్ చేయడం ఈజీ అని సిట్ భావించింది. అయితే సిట్ వ్యూహానికి విరుగుడుగా కొందరు అలోవెరా జ్యూస్ తాగి డేటాక్సిఫికేషన్ ద్వారా రక్తం లో డ్రగ్స్ ఆనవాళ్లు బయటపడకుండా చేసుకున్నారని వార్తలు వచ్చాయి. మొత్తానికి సిట్ బలవంతం మీద ముగ్గురే ముగ్గురు రక్తపు నమూనా ఇచ్చారు. ఆ ముగ్గురి శాంపిల్స్ ను ఫోరెన్సిక్ పరీక్షలకు పంపారు. ఆ పరీక్షల ఫలితాలు వచ్చేశాయట. పరీక్షలు జరిపిన ముగ్గురిలో ఒకే ఒక్కరి శాంపిల్ లో డ్రగ్స్ ఆనవాళ్లు కనిపించాయట. దీంతో ఆ ఒక్కడు ఎవరా అని టాలీవుడ్ లో చాలా మంది ఆరా తీస్తున్నారు. త్వరలో సిట్ ఆ ఒక్కడిని అరెస్ట్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.