ప్రభాస్‌ కోసం ఏడు కోట్లతో…!

Prabhas Plans A Surprise For Fans On His Birthday

‘బాహుబలి’ చిత్రంతో ఒక్కసారిగా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపును సొంతం చేసుకున్న ప్రభాస్‌ ప్రస్తుతం రెండు చిత్రాల్లో నటిస్తున్నాడు. మూడు వందల కోట్లతో సుజిత్‌ ‘సాహో’ చిత్రాన్ని బాలీవుడ్‌ స్థాయిలో తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రంతో పాటు ‘జిల్‌’ ఫేం రాదాకృష్ణ తెరకెక్కిస్తున్న ప్రేమ కథా చిత్రంలో ప్రభాస్‌ నటిస్తున్నాడు. ఈ చిత్రంలో పూజా హెగ్డే ప్రభాస్‌ సరసన రొమాన్స్‌ చేస్తోంది. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్‌ ఇటలీలో జరుగుతోంది. ప్రభాస్‌, పూజాల మధ్య పలు రొమాంటిక్‌ సీన్‌లు తెరకెక్కిస్తున్నారు. ఇటలీలో షూటింగ్‌ జరుగుతుండగానే తర్వాతి షెడ్యూల్‌కు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి.

prabash

ఇటలీ షెడ్యూల్‌ పూర్తి కాగానే హైద్రాబాద్‌లో తదుపరి షెడ్యూల్‌ మొదలు కానుంది. అందుకోసం హైద్రాబాద్‌లో భారీ సెట్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఏడు కోట్ల ఖర్చుతో ఈ సెట్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఈ సెట్‌లో కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారట. అందుకే చాలా భారీగా ఏర్పాటు చేస్తున్నారు. ఈ చిత్రాన్ని కృష్ణం రాజు సొంత బ్యానర్‌లో నిర్మిస్తున్నారు. ప్రేమకథ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ‘జాన్‌’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారు.

Pooja-Hegde-hot-pics