బాబు ఒక మగ వగలాడి…పవన్ అమయాకుడు : పోసాని కొత్త పల్లవి

posani krishna murali comments on chandrababu

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

చంద్రబాబు మీద ఈరోజు పోసాని కృష్ణమురళి ప్రెస్‌మీట్ పెట్టారు. తెలుగుదేశం అధినేత ఇటీవల చేసిన వ్యాఖ్యలపై కౌంటర్లు ఇస్తూ పోసాని మాట్లాడారు. చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారని పోసాని అన్నారు. అలాంటి వ్యక్తికి నీతి, నిజాయితీ అంటూ మాట్లాడే అర్హత ఏముంది? అని ప్రశ్నించారు. ఎన్టీఆర్ పార్టీ.. జెండా… లాక్కున్న మగ వగలాడి చంద్రబాబు అని పోసాని ఆరోపించారు. పార్టీ ఎమ్మెల్యేలను లాక్కోవటమే ఆయన ఆరాటమని ఓటుకి నోటులో దొరికి.. విజయవాడ పారిపోయిన బాబుకి.. అభివృద్ధి చేయాలనే ఆరాటమెక్కడిదని ఆయన విమర్శించారు. ‘బాబుకి ఓటేస్తే.. కమ్మ కులానికి.. కమ్మ రాష్ట్రానికి ఓటేసినట్టు, వైసీపీకి ఓటేస్తే బీజేపీకి ఓటేసినట్టు అంటున్నావు. అసలు బీజేపీ అంటరాని పార్టీ అనా.. మీ ఉద్దేశ్యం. ఇన్నాళ్లు బీజేపీ కాళ్ళు నాకిన నీవు, బీజేపీ తో కలవను.. తప్పు అయ్యింది అని పోసాని తీవ్రంగా విమర్శించారు.. తర్వాత మోడీ కాళ్ళు మొక్కి మళ్ళీ కలిశావ్. ఇప్పుడు మోడీని తిడుతున్నావ్… ఏం మారినట్టు మోడీ. పదవి… నీ సీట్ కోసం ఎవరినైనా చంపుతావ్’ అంటూ బాబుపై పోసాని మండిపడ్డారు.

ప్రతిపక్ష నేత జగన్ అవినీతి వ్యవహారం కోర్టులే చూసుకుంటాయని, చంద్రబాబు తన అవినీతిపై నార్కోఎనాలసిస్ టెస్ట్‌కు సిద్ధమా అంటూ మరోసారి పోసాని ప్రశ్నించారు. కాంగ్రెస్‌లో ఓడిపోయి టీడీపీలో చేరిన చంద్రబాబు ఆ పార్టీని ఎన్టీఆర్ నుంచి లాక్కున్నాడని, ఎన్టీఆర్ చావుకు చంద్రబాబే కారణమని పోసాని కృష్ణమురళి ఆరోపించారు. . ప్రత్యేక హోదా వద్దని అన్నది నువ్వే.. ఇప్పుడు హోదా ఇవ్వు అంటే ఇస్తాడా..? జగన్ ని జైల్లో పెడితే… మళ్ళీ గెలవచ్చు అని బాబు ఆలోచిస్తున్నాడని… 15 కేస్ ల పై స్టే తెచ్చుకున్న నువ్వు జగన్ కి ఎందుకు ఇవ్వలేదని ఆయన ప్రశ్నించారు. అసలు నీవు ఎంతమందిని మేనేజే చేసుకున్నావ్.. కేసీఆర్ కి ఒక్క శాతం మానవత్వం లేకుంటే.. జైల్లో ఉండేవాడివని ఆయన ఆరోపించారు. పవన్ కళ్యాణ్…అమాయకుడని… సీనియర్ అని బాబుకి మద్దతు ఇచ్చాడని.. రాజకీయాల్లో సీనియారిటీ కాదు.. సిన్సియార్టీ కావాలని పోసాని వివరించారు. ఓ వర్గం మీడియాకి కులం పిచ్చి పట్టిందని.. జగన్ ని ఆ మీడియాలు చంపేశాయని.. సాక్షి లేకుంటే… జగన్ అండమాన్ లో ఉండేవారని పోసాని సూటిగా మాట్లాడారు.

గతంలో పీఆర్పీలో మాత్రమే ఉన్నానని ప్రస్తుతం తనకు ఏ పార్టీతో సంబంధం లేదని పోసాని పేర్కొన్నాడు. నా నిజాయతీని నమ్మి చిరంజీవి నాకు టికెట్ ఇచ్చారని యర్వాత రాజకీయ పరిపక్వత లేక ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్ లో విలీనం చేశాడని అన్నారు నిజానికి చిరంజీవి చాలా మంచి వ్యక్తి. ఆయన అవినీతి చేయలేదని అన్నారు. నాకు ఓటు వేస్తే కాపులకు వేసినట్టేనని 2009లో చిలకలూరిపేటలో ప్రచారం చేశారని ఈ ప్రచారానికి తెరలేపింది చంద్రబాబే నని అనవసరంగా చిరంజీవికి కాపు కుల ముద్ర వేశారని ఆయా విమర్శించాడు. కాపులకు కమ్మలకు మధ్య చిచ్చు పెట్టింది ఎవరో అందరకీ తెలుసునని చిరంజీవి అవసరం లేనప్పుడు ఆయన తమ్ముడు, కాపు కులానికి చెందిన పవన్ కళ్యాణ్ ఎలా అవసరమయ్యాడు ? అని ఆయన ప్రశ్నించాడు. పవన్ కళ్యాణ్ కారణంగానే తెలుగుదేశం అధికారంలోకి వచ్చిందని పోసాని పేర్కొన్నాడు.

తాను మళ్ళీ ఏ పార్టీలో చేరదల్చుకోలేదని అలాగే భవిష్యత్ లో ఏ నామినేటెడ్ పదవి తీసుకోనుగానీ, నా ఓటు మాత్రం వైసీపీకి వేస్తానని ఆయన పేర్కొన్నారు..తానొక ఓటర్ గానే మాట్లాడుతున్నాననన్న ఆయన ఉన్న వాళ్ళల్లో జగనే బెటర్ అని తన నమ్మకమని చెప్పారు. రుణమాఫీ చేస్తానని జగన్ ఒక మాట అని ఉంటే .. 2009లో జగన్ ఖచ్చితంగా గెల్చేవాడని పోసాని అన్నారు. చంద్రబాబుకు‌ తప్ప .. ఏపీలో పవన్ కళ్యాణ్ సహా అందరకీ సొంత జెండాలున్నాని పేర్కొన్నారు. పవన్ గురించి విశ్లేషణ చేయటం అప్పుడే తొందరపాటు అని ఇతర పార్టీల నుంచి గెల్చిన ఎమ్మెల్యేలను ఎవరు చేర్చుకున్నా.. అది బ్రోకర్ పనే అని ఆయన పేర్కొన్నారు