చంద్రబాబు నాయుడిపై పోసాని ఘాటైన వ్యాఖ్యలు

చంద్రబాబు నాయుడిపై పోసాని ఘాటైన వ్యాఖ్యలు

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై వైసీపీ నేత. సినీనటుడు పోసాని కృష్ణమురళి ఘాటైన వ్యాఖ్యలు చేశారు. తాజాగా మీడియాతో మాట్లాడిన పోసాని చంద్రబాబుది క్రిమినల్ మైండ్ అని, ఉద్యమాల పేరుతో చంద్రబాబు లాంటి వాళ్ళు ముసలి కన్నీరు కారుస్తున్నారని అన్నారు. అమరావతి రైతులను జగన్ మోసం చేస్తున్నాడని చంద్రబాబు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.

అయితే చంద్రబాబు మాటలను నమ్మిన రాజధాని ప్రజలు ఉద్రేకంతో రోడ్ల పైకి వస్తున్నారని, ఆ ఉద్రేకంతో గుండె నొప్పి వచ్చి మరణించిన వారి చావులకు చంద్రబాబు స్వార్ధమే కారణం తప్పా జగన్ ప్రభుత్వం కాదని అన్నారు. చంద్రబాబుకి కేవలం సీటు, ఓటు, నోటు మాత్రమే కావాలని దానికోసం ఆయన దేనికైనా సిద్దపడుతారని అన్నారు. అయితే చంద్రబాబుపై నాకు ఎలాంటి పగ, ప్రతీకారాలు లేవని చంద్రబాబు ప్రజాసేవ చేసినప్పుడు ఆయనకు నా వంతుగా సపోర్ట్ చేశానని, ఆయన ప్రచారానికి కూడా యాడ్‌లు చేశానని పోసాని చెప్పుకొచ్చారు.