రేప్ చేస్తూ… రేప్ చేసినోడిని చంపేయాలని పోస్ట్ లు

posts to kill rape victim

ఒంగోలులో మైనర్ బాలికను ఐదు రోజుల పాటు నిర్బంధించి సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటనలో నిందితుడైన వికలాంగ యువకుడు బాజీ మీద నెటిజన్లు మండిపడుతున్నారు. హన్మకొండలో 9నెలల చిన్నారిపై హత్యాచారం ఘటనను నిరసిస్తూ ఫేస్‌బుక్‌లో పోస్ట్ పెట్టిన బాజీ తానే అత్యాచారం కేసులో ఇరుక్కున్నాడు. దీంతో అతడు పోస్టును స్క్రీన్‌షాట్స్ తీసిన నెటిజన్లు దుమ్మెత్తి పోస్తున్నారు. నీతులు చెప్పే నువ్వే ఇంతటి నీచపు పని చేశావా? అంటూ మండిపడుతున్నారు. ఒంగోలుకు చెందిన బాజీది పేద కుటుంబం. తండ్రికి మానసిక పరిస్థితి బాగోలేకపోవడంతో తల్లి ముగ్గురు పిల్లల్ని తీసుకుని సొంతూరైన సంతనూతలపాడు మండలం మైనంపాడుకు చేరుకుంది. కూలీనాలీ చేసుకుని పిల్లలను పోషిస్తూ బతుకీడుస్తోంది. ఏడేళ్ల వయస్సులో ఆడుకుంటూ కరెంట్ షాక్‌కు గురైన బాజీ రెండు చేతులు కోల్పోయాడు. ఆ కుటుంబ పరిస్థితి చూసి చలించిన ప్రజాసంఘాలు, ప్రజాప్రతినిధులు అప్పట్లో సాయం చేశారు. ఏ పనీ చేయలేక కొన్నాళ్ల పాటు భిక్షమెత్తుకున్న అతడు తర్వాత ఒంగోలు బస్టాండులోని ఓ షాపులో పనికి కుదిరాడు. వికలాంగుడైనా కష్టపడి తల్లికి సాయం చేస్తుండంతో బాజీ అంటే అందరూ అభిమానించేవారు. సమాజంలో జరిగే ఘటనలపై బాజీ సోషల్‌మీడియా ద్వారా స్పందించేవాడు. గత వారం హన్మకొండలో జరిగిన 9నెలల చిన్నారిపై హత్యాచారం ఘటనపై కూడా పోస్టు పెట్టాడు. ‘చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడిన నిందితుడిని చంపేయాలి’ అంటూ భావోద్వేగంతో జూన్ 21వ తేదీన ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశాడు. అయితే మైనర్ బాలికను 17వ తేదీనే ట్రాప్ చేసి రూమ్‌కి తీసుకెళ్లి రేప్ చేస్తూనే నాలుగు రోజుల తర్వాత మరో అత్యాచార ఘటనపై ఆవేదనగా స్పందించడం మీద తప్పు పడుతున్నారు.